అయినవోలు మెడికల్ షాపుల దందా ప్రజారోగ్యానికి ముప్పు

అయినవోలు మండల కేంద్రంలో మెడికల్ షాపుల దందా – ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
ప్రాణాల కంటే లాభం గొప్పదా?
అధికారుల నిర్లక్ష్యం – ప్రజలకు శాపం కాకూడదు.

నేటి ధాత్రి అయినవోలు :-

అయినవోలు మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యమే పెట్టుబడిగా మారిపోయింది. వైద్య వృత్తి పవిత్రతను తుంగలో తొక్కుతూ, అర్హత లేని వ్యక్తుల చేతిలో మెడికల్ షాపులు, అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పీలు గ్రామీణ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు. ఒక క్రమబద్ధమైన దందా.

ఫార్మసీ డిగ్రీ, లైసెన్స్, అర్హత ఏమీ లేకుండానే మెడికల్ షాపులు నడుపుతున్న నకిలీ ఓనర్లు, మేమే డాక్టర్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆపద సమయాల్లో, అనారోగ్య కారణంగా నడవలేకున్నామన్నా మా ఇంటికే రండి, ఇంటికి వస్తేనే వైద్యం చేస్తాం” అంటూ హుకుం జారీ చేస్తున్న ఆర్.ఎం.పీల దుస్సాహసం రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య నియమాలు, మానవతా విలువలు అన్న మాటే లేకుండా డబ్బే పరమావధిగా మారింది. అర్హత లేని మెడికల్ షాప్ నిర్వాహకుల కారణంగా ఇటీవల కుటుంబ సభ్యులే సొంతంగా ఇచ్చిన వైద్యం తిని ఆస్పత్రిపాలైన సంఘటనలు కలవరపెడుతున్నాయి. అయినా సంబంధిత శాఖల కళ్లెందుకు మూసుకుపోయాయో అర్థం కాని పరిస్థితి. వృద్ధులు, నిరక్షరాస్యులు లక్ష్యంగా కొందరు ఆర్ఎంపీలు ఇంటింటికి తిరిగి సొంత మందుల సరఫరా చేస్తూ, అర్థ రూపాయి విలువైన గోలిమందుకు రూ.5 వసూలు చేస్తున్న దోపిడి పట్ట పగలు బహిరంగంగానే జరుగుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ షాప్ ఓనర్లు మందుల పేరుతో చేస్తున్న దందాకు అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు, వైద్య శాఖ అధికారులు ఎక్కడున్నారు? సరైన అర్హత లేని వారు షాపులు నడుపుతుంటే, వారిచ్చే కమిషన్ల కోసం కొందరు చేస్తున్న నకిలీ వైద్యం కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థే మౌనంగా ఉంటే, ఈ దందాకు నైతిక బాధ్యత ఎవరిది? నకిలీ మెడికల్ షాప్ ఓనర్లు, అర్హత లేని ఆర్.ఎం.పీలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికార యంత్రాంగం కూడా ఈ నేరానికి భాగస్వాములే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా వైద్యాధికారులు, డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు కళ్లుతెరవాలి. లైసెన్స్ లేని మెడికల్ షాపులను సీజ్ చేయాలి. అర్హత లేకుండా మందులు విక్రయించే వారిని వైద్యం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేదంటే ప్రజల ఆరోగ్యంతో జరుగుతున్న ఈ దందా మరిన్ని ప్రాణాలను బలి తీసుకోవడం ఖాయం.

కార్మికుల ప్రాణాలు పట్టణి సింగరేణి యాజమాన్యం…

కార్మికుల ప్రాణాలు పట్టణి సింగరేణి యాజమాన్యం,

మందమర్రి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మంచిర్యాల జిల్లా కమిటీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రమాదల నివారణకు సి అండ్ ఎండీ చైర్మన్,డైరెక్టర్లకు,సేప్టి జీఎం జోక్యం చేసుకోవాలి.

ఓకే కుటుంబం,ఒకే లక్ష్యం,ఓకే గమ్యం అనే నినాదం పేరుకేనా?
అధికారులకు సిపిఎం సూటి ప్రశ్న

సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి

గనిప్రమాదాలు,రక్షణ చర్యలు,
పని ఒత్తిడి,వైద్య సౌకర్యాల్లో కొనసాగుతున్న లోపాలపై జిఎం కార్యాలయం వద్ద సీపీఎం నిరసన పర్సనల్ మేనేజర్ గార్క్ వినతి పత్రం.

ఎస్ సి సి ఎల్ మందమర్రి,
శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలల్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పర్మనెంట్,
కాంట్రాక్టు కార్మికులు విధుల నిర్వహణలో అనేక ప్రమాదాలు జరిగి మరణించడం, గాయలపాలు కావడం జరుగుతుంది.తమ ఆప్తులను కోల్పోయిన
వారి కుటుంబాలు మానసికక్షోభకు గురై పోతున్నారు.సంస్థను లాభాల బాటలో నడిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడడంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నది.ఉత్పత్తి,లాభలు సాదిసిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం రక్షణ వ్యవస్థను పటిష్టం చెయ్యడం లేదు,రక్షణ సూత్రాలను యాజమాన్యం పాటించడం లేదు.పని ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులున్నాయో కార్మికులు,కార్మిక సంఘాలు చెప్పిన కూడ కనీసం వినడం లేదు,
పట్టించుకోవడం లేదు.
కాల పరిమితి నిండిపోయి,చెడిపోయిన యంత్రాలతో పని చేయిస్తు.
ప్రమాదాలకు కారణం అవుతున్నారు.ప్రమాదంలో గాయపడ్డవారిని గనిలో నుంచి తీసుకురావడం కోసం కనీసం స్త్రేచ్చర్ లేకపోవడం,అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం,నిపుణులైన వైద్యులు లేకపోవడాన్ని చూస్తుంటే సింగరేణిలో ఆటవీక రాజ్యం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది.పని స్థలాల్లో స్వచ్ఛమైన గాలి అందకపోవడం,రక్షణ చర్యలు చేపట్టకపోవడం,
ఉత్పత్తి,లాభాల కోసం షిప్ట్ ల సంఖ్యను పెంచడం,
నాసి రకమైన రక్షణ పరికరాలతో బలవంతంగా ప్రమాదకరమైన పరిస్థితిల్లో కార్మికులను యంత్రాల్లగా పని చేయించడం జరుగుతుంది.
గడిచిన 2,3 సం.రాల నుంచి నేటి వరకు అనేక ప్రమాదాలు జరిగి పలువురు పర్మనెంట్,కాంట్రాక్టు కార్మికులు
మరణించడం,గాయల పాలుకావడం జరిగింది.
ఇన్ని ప్రమాదాలు జరిగినా బాధ్యులపై చర్యలు లేవు, భవిష్యత్తులో జరగకుండ చెయ్యడం కోసం యాజమాన్యంలో చలనం లేదు.
ఉత్పత్తి,లాభాల కోసం యాజమాన్యం ఎంతైతే శ్రద్ద పెట్టుతున్నదో అంతకంటే ఎక్కువ శ్రద్ద కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం తక్షణమే రక్షణ వ్యవస్థను బలోపేతం కోసం తగిన చర్యలు చేపట్టాలి.లేకుంటే
ప్రతి మరణం,ప్రమాదం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం చేస్తున్న కుట్రలుగా కార్మికులు,ప్రజలు బావించ వల్సిసి వస్తుంది.
సి & ఎండీ చైర్మన్,డైరెక్టర్లకు,
సేఫ్టీ జీఎం,కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్మికుల ప్రాణాలను కాపాడలని డిమాండ్ చేస్తున్నాము.

డిమాండ్స్

1,జరిగిన ప్రమాదాలు,దాని కారణాలు,రక్షణ వ్యవస్థ పని తీరుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.
2,తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తక్షణమే అన్ని పర్మనెంట్,కాంట్రాక్టు యూనియన్లతో,నిపుణులతో,సీనియర్ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి.
3,ప్రమాదాలకు బాధ్యులుగా స్థానిక అధికారి,సేఫ్టి అధికారి, ఏరియా జనరల్ మేనేజర్లపై చర్యలు తీసుకోవాలి.
4,డీజీఎంఎస్ తో జరిగే త్రిసభ్య కమిటి సమావేశంలో అన్ని కార్మిక సంఘాలను, కాంట్రాక్టు కార్మిక సంఘాలను పిలవాలి.
5,ప్రతి షిఫ్ట్ లో సెప్టి అధికారులను నియమించాలి.
6,పని ప్రదేశాల్లో పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.
7,ప్రతి విభాగం వద్ద ప్రాథమిక వైద్యంతో పాటు,అంబులెన్స్ లు,
స్త్రేచ్చర్లు,ఆక్సిజన్,ఫస్ట్ యిజ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలి
8,బెల్లంపల్లి,రామకృష్ణ పూర్ ఏరియా ఆసుపత్రిలల్లో అన్ని రకాల వైద్య నిపుణులతో పాటు,తగినంత సిబ్బందిని నియమించాలి.
9,ఉత్పత్తి,లాభాలే కాదు కార్మికులు,వారి కుటుంబాలు,ప్రాణాలు,
సంక్షేమం మాదే అనే విధంగా యాజమాన్యం వ్యవరించాలి.
10,ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ తో పాటు డాక్టర్లను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించాలి.
11,కార్మికులకు రక్షణ మరియు సంక్షేమానికి నిధులను పెంచాలి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు

సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
గోమసా ప్రకాష్,బోడెంకి చందు
జిల్లా కమిటీ సభ్యులు
దూలం శ్రీనివాస్,గుమసా అశోక్,సామల ఉమ రాణి.

నాయకులు దాగం శ్రీకాంత్,
జి.మహేందర్,సిడం సమ్మక్క, బి.రమాదేవి,నిర్మల
,సిడం జంగు బాయి,
కె.రాజేశం, రాజలింగు, పోషం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version