“శ్రీసిటీకి కొత్త ఎస్ఐ ప్రియాంక”

*శ్రీసిటీ హైటెక్ పి.ఎస్ నూతన ఎస్ఐ గా ప్రియాంక..

శ్రీసిటీ(నేటిధాత్రి)డిసెంబర్ :

 

శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్ నూతన ఎస్ఐ గా ప్రియాంక సోమవారం భాద్యతలు చేపట్టారు.
తిరుపతి ఎస్.బి నుంచి ఇక్కడ కు ఉన్నతాధికారులు బదిలీ చేయడం జరిగింది.
ఎస్ఐ ప్రియాంక గతంలో నాగలాపురం, నారాయనవనం మండలాల్లో విధులును నిర్వహించిఉన్నారు‌.
అలాగే బుచ్చినాయుడు కండ్రిగ ఎస్.ఐ సుధీర్ కుమార్ రెడ్డిని, చంద్రగిరి పిఎస్ నుండి చిత్ర తరుణ్ ను ఉన్నతాధికారులు ఇక్కడకు బదిలీ చేశారు.
దీంతో శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్ లో ముగ్గురు ఎస్ఐ లు నూతనంగా విధులును నిర్వర్తించనున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ప్రియాంక మాట్లాడుతూ..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధి నిర్వహణలో రాజీ లేకుండా కృషిచేస్తామన్నారు.
శ్రీసిటీ పారిశ్రామిక వాడ భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మైన రీతిలో భద్రత చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.
శ్రీసిటీ సెజ్ గ్రామీణ ప్రాంత ప్రజలుకు, మహిళా కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారుఈ ప్రాంతంలో ఏవైనా భద్రతా పరమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version