ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్..

ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్

 

నడికూడ,నేటిధాత్రి:

 

ఇటీవల నూతనంగా ఎన్నికైన నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కోంగంటి తిరుపతి, ఉపసర్పంచ్ కంఠాత్మకూర్ కుమారస్వామి దామెర పోలీస్ స్టేషన్లో ఎస్సై కొంకర అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుష్పం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్,కోశాధికారి బొమ్మ కంటి విజేందర్,మాజీ సర్పంచ్ కంఠాత్మకూర్ కొమురయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి నరేష్,టీపీసీసీ పరకాల నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాయిడి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version