మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
అభివృద్దే ద్యేయంగా పనిచేసే నాయకుడు పావుశెట్టి సునీల్
18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్
పరకాల,నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పావుశెట్టి సునీల్ కుమార్ను శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా 18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పసుల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒంటేరు రమేష్ చైర్మన్ను కలసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా పసుల శ్రీనివాస్ మాట్లాడుతూ పావుశెట్టి సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం పరకాల పట్టణ అభివృద్ధికి మంచి సూచిక అని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేలా ఆయన పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ పావుశెట్టి సునీల్ సమర్థంగా పనిచేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
