దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి…

దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి

రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయ్

తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్-5 ఎల్ఎంసి డిసి-3 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి డిమాండ్ చేశారు.మంగళవారం తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈర్లపైడి మాట్లాడుతూ, నల్లబెల్లి మండలం గొల్లపల్లె గ్రామం నుంచి దబ్బరిపేట, మేడపల్లి, రామారావు తండా, నర్సింగాపురం, ఇటుకలపల్లి, ఆకుల తండా, ఎనగల్ తండా, ముత్తూజిపేట, రాజుపేట దామెర చెరువు వరకు సుమారు 11.905 కి.మీ మేర కెనాల్ నిర్మాణం చేపట్టి దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారని తెలిపారు.అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఆరు సంవత్సరాల క్రితమే పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో కెనాల్ పూర్తికాక సాగునీరు అందక ఈ సీజన్‌లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెనాల్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందలేదని పేర్కొన్నారు.రాబోయే పంట సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వేసవిలోనే పనులను పూర్తి చేసి సాగునీరు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు భూమా అశోక్, ఎలకంటి కుమారస్వామి, సుక్క వీరన్న, నూకల మరి సదానందం, బోనగిరి సారన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version