న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం…

న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం.

◆-: మాపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు నిర్ధారమైనవి కావు.

◆-: మా భూముల పై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసిన తర్వాతే పరిహారం అందించారు.

◆-: చిలేపల్లి తండా మహిళా రైతు గేనీ బాయ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరా సంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్ ) ఏర్పాటుకు 2012లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాలుష్య రైతు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. అందులో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం 12635 ఎకరాల ప్రభుత్వ, అసైన్ పట్టా భూములు సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 7,500 ఎకరాల పైచిలుకు భూములను రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం అందజేశారు. నిమ్జ్ భూ సేకరణలో భాగంగా చీలపల్లి తాండ పరిధిలోని సర్వే నంబర్ 151 లో ఆరుగురు రైతుల పైన 20.33 ఎకరాల భూమి ఉంది. ఇట్టి భూమి రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు చేసుకుంటూ వచ్చారు అధికారులు. 2012 నుంచి 20.33 గుంటల భూమి ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా నమోదయింది. ఇట్టి భూమిలో ఆరుగురు రైతులు గత 30 సంవత్సరాల నుండి కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నిమ్జ్ భూసేకరణ లో భాగంగా ఇట్టి భూమి నష్టపరిహారం అధికారులు మాకు ఇవ్వలేదు. ఇట్టి విషయంపై మేము తెలంగాణ హైకోర్టుకు అప్పిలు చేసినాము.. నిమ్జ్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారు మా యొక్క కేసును వాపు తీసుకున్నచో నష్టపరిహారం ఇస్తామని తెలిపినారు. తెలంగాణ హైకోర్టులో ఇట్టి కేసును 119/2012 కేసును మేము విత్ డ్రా చేసుకున్నాము. ఇటి కేసు విత్ డ్రా చేసుకున్నట్లు జూన్/ 7 /2024లో కేసును రాజీ కుదుర్చుకున్నట్లు నిమ్జ్ ప్రత్యేక అధికారులకు సమర్పించిన తదుపరి వారు విచారణ వారు పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు ల చుట్టూ తిరిగి కేసుల నుండి రాజి కుదుర్చుకున్న తర్వాత నిమ్జ్ అధికారులు ఇట్టి సర్వే నంబర్ భూములపై పూర్తి విచారణ చేసిన తర్వాత మాకు నష్టపరిహారం అందించారు. మా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మా కుటుంబ సభ్యులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ఆసత్యపు ఆరోపణలపై మా కుటుంబ సభ్యులం ముక్తకంఠంతో త్రీవంగా ఖండిస్తున్నాం. మాకు ప్రభుత్వ అధికారులు పూర్తి విచారణ అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారు. ఈ విషయంలో కొందరు కావాలని మాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బులకు ఆశపడి ఇతరులు చెప్పుడు మాటలు విని మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆరోపణలు నిరాధారణమైనవి కావు. ఈ సమావేశంలో జాదవ్ ధర్మీబాయి, సుమిత్ర బాయ్, మోతి బాయ్ , రేఖ భాయ్, సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.

రైతు ఇంట సంక్రాంతి కాంతులు

సంక్రాంతి రైతు ఇంట కాంతిని నింపాలి…

మంత్రి సీతక్క సహకారం మరువలేనిది

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

రైతులకు పట్టు వస్త్రాలు పంపిణీ…

వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు….

మంగపేట నేటిధాత్రి

 

సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని ఆ దిశగా ప్రభుత్వాల సహకారం, ప్రకృతి కరుణ ఉండాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు బుధవారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాసిరెడ్డీ సాంబశివరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగ అభివృద్ధిలో మంత్రి శీతక్క సహకారం మరువలేనిదన్నారు సంక్రాంతి పర్వదినం వ్యవసాయ రంగానికి ప్రతీకగా రైతులు భావిస్తారని అన్నారు ఈ మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా వివేక ఎ ఫ్బి ఓ , వికాస్ అగ్రి ఫౌండేషన్ మరియు వికాస్ ఫర్టిలైజర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు జరీ పట్టు వస్త్రాలను బహుకరించటం ఈ కార్యక్రమంలో తాను కుటుంబ సభ్యులతో హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సాంబశివరెడ్డి అన్నారు తమ సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల కోసం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం ఎంపిక చేసిన తొంబై మంది రైతులకు పట్టు వస్త్రాలను బహూకరించినట్లు ఆయన తెలిపారు తమ సంఘం పరిధిలోని రైతులందరికీ ఉచిత ప్రమాద బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించినట్లు సాంబశివ రెడ్డి ప్రకటించారు అనంతరం సంక్రాంతి కానుక గా రైతులకు జరి పట్టు రామ్ రాజ్ పంచలు చొక్కా ల ను సాంబశివరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి కి పుష్పగుచ్చం అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి కటుకూరు శేషయ్య ధూళిపాల బాలకృష్ణ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు షేక్ మొయినుద్దీన్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్కీ వెంకన్న జిల్లా పేసా కమిటీ అధ్యక్షులు డబ్బుల ముత్యాలరావు దొడ్డ భాస్కర్ రమేష్ కృష్ణారెడ్డి పెండ్యాల హరి కృష్ణ వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు చెట్టుపల్లి తిరుపతిరావు జడ్డి పూర్ణ ప్రసాద్ నేలపట్ల శేషారెడ్డి వంద మందికి పైగా స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం ఎండలో.. రైతులు

యూరియా కోసం ఎండలో.. రైతులు

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం ఉదయం నుండి రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. 34 డిగ్రీల ఎండలోనూ నిలబడి యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఒక్కసారిగా వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకోవడంతో రోడ్డుపై భారీగా రద్దీ ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వివిధ ఆరుతడి పంటలు సాగు చేసి యూరియా దొరకకపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి సరిపడ యూరియా సరఫరా చేయాలని రైతులు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version