Headlines

రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లు సాధించుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది

భద్రాచలం నేటి రాత్రి

ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మిన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ

అభివృద్ధి కోసం శ్రమించే వ్యక్తి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని ప్రజలే గెలిపించుకుంటారు

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం కోసం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోగల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ పార్టీని నమ్మి రాష్ట్ర ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలుపరచి ప్రజా పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇండియా కూటమి విజయం సాధించి, దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా సమన్యాయ పాలన కోరుకుంటున్నారని, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ అభివృద్ధి కోసం శ్రమించే వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించడం ఖాయమని ఆయన మాట్లాడారు.
ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము కాంగ్రెస్ నాయకులు అన్నేం రామిరెడ్డి, షబ్బీర్ భాష,మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి, తుమ్మల రాణి, కట్ట కళ్యాణి, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *