రోడ్డుపై రాస్తారోకో చేసిన దళిత సంఘాల నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగలకు ఇవ్వాలని దళిత సంఘాలు ధర్నా చేయడం జరిగింది పోలీసులు దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం జరిగింది అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా చాలా ఉన్నది అలాగే వరంగల్ పార్లమెంటు పరిధిలో మాదిగల జనాభా చాలా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీనీ నమ్ముకొని పనిచేసిన మాదిగలకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగలకు కేటాయించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పుల్ల ప్రేమ్ సాగర్ కోడెపాక సంజీవయ్య మంతెన రాజేష్ కొమురయ్య సంజీవ్ శ్రీనివాస్ రాజమౌళి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు