నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ జన్ను ప్రభాకర్ గుండెపోటుతో ఇటీవల మరణించగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రకాడ సానుభూతి తెలియజేశారు యూత్ అధ్యక్షుడు మర్రిరాజు, అఖిల్, సురేష్, సాల్మన్, ఏలియా, కిషోర్, సిద్దు, సుమన్, హరీష్, పవన్, పోశాలు తదితరులు పాల్గొన్నారు.