ప్రధాన కార్యదర్శిగా బొచ్చు నవదీప్
పరకాల నేటిధాత్రి
మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు పట్టణ కేంద్రంలోని అమరధామంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండల అధ్యక్ష కార్యదర్శులను ఏకు శంకర్ మాదిగ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ పిబ్రవరి 7న జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుల ప్రదర్శన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంఎఫ్ఎఫ్ మండల అధ్యక్షునిగా కోగిల అరవింద్ మాదిగ,ప్రధాన కార్యదర్శిగా బొచ్చు నవదీప్ మాదిగలను ఏకగ్రీవంగా ఎనుకున్నట్టు తెలిపారు.రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చిన విద్యార్థులను అధిక సంఖ్యలో భాగస్వాములను చేసి సభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజశేఖర్,రాకేష్,నవనీత్ మాదిగలు,ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి,డప్పు కళాకారుల సంఘం నాయకులు కోగిల రవి డబ్బాల్,మడికొండ ప్రమోద్ కుమార్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.