గ్రామాల్లో పెరిగిపోతున్న కుక్కల బెడద

ఒక్కో గ్రామంలో పదులసంఖ్యలో కుక్కల గుంపులు

పరకాల నేటిధాత్రి
పరకాల మండలంలోని పలు గ్రామాలలో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేయడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.పలుచోట్ల పాఠశాలకు వెళ్ళే విద్యార్థులపై దాడులకు దిగుతున్నాయని సమాచారం వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే వారిపై దాడి చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి.వాహనాలపై ప్రయాణించే వారిని కుక్కలు గుంపులుగా వెంబడిస్తున్నాయని కుక్కల సమస్యపై గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శులకు,సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు.గతంలో మాదారం శివారులలో మూగజీవాల,పశువుల పై కుక్కలు దాడులు చేస్తుండడంతో పలువురు గాయాలపాలై ఆసుపత్రులకు పరుగులు తీసిన విషయం తెలిసిందే అదిఅలా ఉండగా ద్విచక్ర వాహనాల పై వెళ్లే వారిని వెంబడిస్తుండడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.మండలంలో దాదాపుగా ప్రతి గ్రామంలో సుమారు 20 నుంచి 50 వరకు కుక్కలు ఉన్నట్లు సమాచారం పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే పట్టణంలో పరిసర గ్రామాలలో ఈ పరిస్థితి తెలెత్తుతుంది చెప్పవచ్చు,దీంతో వీధుల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండడంతో చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు.వెంటనే అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!