హనుమకొండ, నేటిధాత్రి(లీగల్):-
ఐ ఎన్ టి య సి (ఎఫ్) హనుమకొండ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా సూరం నరసింహ స్వామిని మరియు జనరల్ సెక్రటరీ గా కొంతం నాగేశ్వర్ ను నియమిస్తూ ఐ ఎన్ టి యు సి (ఎఫ్) రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ బుద్ధారం మురహరి తేది:-16-01-2025 నాడు ఉత్తర్వులు జారీచేశారు. గత కొంత కాలంగా వీరు కార్మికులకు న్యాయ సహాయం అందిస్తున్నారు. వీరియొక్క సేవలను గుర్తించి వీరిని ఈ పదవులలో నియమించారు., తమ మీద నమ్మకంతో తమకు ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు స్వామీనాథ్ జస్వాల్ జి గారికి మరియు రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ బుధ్ధారం మురహరి గారికి మరియు కార్యవర్గ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియామకం పై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.