సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరిని గ్రామ సభ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రవేశపెట్టబోయే రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డులు భూమిలేని రైతు కూలీలకు కూలి భరోసా మొదలగు సంక్షేమ పథకాలు జనవరి 26వ తారీఖున ప్రారంభమయ్య పథకాలన్నిటికీ గ్రామ సభలో అధికారులు పారదర్శకత పాటించి అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని అధికారులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సహకరించాలని పార్టీలకు అతీతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల జాబితాలను గ్రామసభలో పారదర్శకత పాటించి అర్హులైన ప్రతివారికి ఎంపిక చేయాలని అదేవిధంగా వాన కాలంలో రైతు భరోసా ఆగి నందుకు దానిని కూడా కలిపి ఏకకాలంలో రెండు పంటల రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయాలి ఇందిరమ్మ ఇండ్లను గ్రామ సభ ద్వారా అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి భూమిలేని కూలీలకు ఇచ్చే భరోసా పథకాన్ని ఉపాధి హామీ పనిని 20 రోజులు కనీసం చేయని వారిని కూడా ఈ పథకంలో లబ్ధి దారులుగా చేకూర్చి వారికి ఈ పథకాన్ని కూడా వర్తింప చేయాలి,నూతన రేషన్ కార్డులను ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కొంతమందికి పేర్లు నూతన రేషన్ కార్డులలో జాబితాలో రాలేదు వాటిని కూడా అధికారులు పున పరిశీలించి అందరి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరు అయ్యే విధంగా చూడాలని కోరడం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న ఏఐటీయూసీ నాయకులు నారాయణ అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!