భువనగిరి పార్లమెంటరీ జనగామ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశన్ని జయప్రదం చేయండి

మద్దూరు నేటిధాత్రి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును, కాంక్షిస్తూ నిర్వహించే విస్తృతస్థాయి సమావేశ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభను జయప్రదం చేయాలని, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కామెడీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకై, ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న అరు గ్యారంటీలను ప్రజల్లోకి, విస్తృతంగా తీసుకెళ్లాలని విభిన్న సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దేశంలో సెక్యులరిజం కాపాడుకోవడం, మతసామరస్యం లౌకిక విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కదలాలని దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు. అత్యధిక స్థానాలు గెలుపొంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయుటకై నిరంతరం కృషిని కొనసాగించాలని, తెలుపుతూ సమావేశంను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి, మద్దూరు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు మేక మల్లేశం, దూల్మిట్ట పార్టీ అధ్యక్షులు కోల సాయిలు నాయకులు ఉట్ల శ్రీధర్ రెడ్డి బందారం శ్రీనివాస్, గద్దల మహేందర్, చొప్పరి మల్లేశం ఎర్ర భచ్చల శ్రీనివాస్ మస్త్యాల మనోహర్ పల్త్యా శ్రీనివాస్, చెన్నోజు రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *