కార్మిక చట్టాలు అమలు చేయాలి

కార్మిక చట్టాలు అమలు చేయాలి

నర్సంపేట పట్టణంలో వివిధ దుకాణాలలో పనిచేస్తున్న గుమస్తాలకు కార్మికచట్టాలు అమలుచేయాలని కోరుతూ జిల్లా లేబర్‌ అధికారి రమేష్‌బాబుకు టీఆర్‌ఎస్‌ కెవి ఆద్వర్యంలో అవినీతిపత్రాన్ని అందజేశారు. టిఆర్‌ఎస్‌ కేవి రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజులు మాట్లాడుతూ గుమస్తాలకు ఎనిమిదిగంటల పని విధానం అమలుకావడం లేదని, రోజుకు 12గంటలు పనిచేయడం వల్ల మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారాంతపు సెలవులు అమలుకావడం లేదని, కార్మికులు పనిచేసే ప్రదేశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దుకాణాల్లో ఎస్టబ్లమెంట్‌ యాక్ట్‌ అమలుకావడం లేదని ఒక్క కార్మికుడికి ఎస్‌ ఫాములు లేవని లేబర్‌ అధికారుల తనిఖీలు లేకపోవడం వల్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, యాజమాన్య సంఘాలతో లేబర్‌ అధికారులు జాయింట్‌ కమిటీని ఏర్పాటుచేసి కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేసే విధంగా చూడాలని, లేనిపక్షంలో టిఆర్‌ఎస్‌ కెవి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలడుగుల రమేష్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *