జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ఎంపిక…

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ఎంపిక
పర్వ తా రోహణ శిక్షణ శిబిరానికి – మొగుళ్లపల్లి ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఈనెల 25 నుంచి అక్టోబర్ 1 వ తేదీ వరకు 
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో జరుగు పర్వతాహరణ శిక్షణ శిబిరానికి మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాల ఎన్.సి. సి విద్యార్థులు నలుగురు , ఎం .అర్జిత్ కుమార్ (10వ); బి అరవింద్ (10వ); జే .అరవింద్ (10వ) , పి. వీరమల్లు( 9వ) లు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పింగిలి విజయపాల్ రెడ్డి ; ఎన్.సి సి అధికారి గుండెల్లి రాజయ్యలు తెలిపారు
ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా శిబిరానికి ఎంపిక అవ్వడం పాఠశాలకు గర్వకారణం అని ఈ శిక్షణ జాతీయ సమైక్యత భావం పెంపొందించుకోవచ్చు, సాహసోపేతమైన కఠినమైన దారుల వెంట నడవడం , క్యాడర్స్ లోపల ఆత్మవిశ్వాసం ధైర్యం సోదర భావాన్ని నెలకొల్పడం కొరకు ఈ శిక్షణను ఇస్తారు అందువల్ల శిక్షణలో
మెలుకువలు తెలుసుకొని దేశభక్తిని పెంపొందించుకొని పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారిని అభినందించారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. రాజు విద్యార్థులు పాల్గొన్నారు.

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొందిన శ్రీనివాస్ రెడ్డి…

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొందిన శ్రీనివాస్ రెడ్డి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

ఉపాధ్యాయ పదోన్నతులలో గతంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో వర్ష కొండ లో ఐదు సంవత్సరాలు. మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల లో కోమటికొండాపూర్ లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొంది మెట్పల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా నేడు పదవి భాద్యతలు స్వీకరించడం జరిగింది. వీరికి పదోన్నతి రావడం పట్ల మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version