పిల్లల భవిష్యత్తుకు ప్రీ ప్రైమరీ విద్య పునాది

పిల్లల భవిష్యత్తుకు ప్రీ ప్రైమరీ విద్య పునాది

మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్

కేసముద్రం/ నేటి ధాత్రి

సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో విలేజ్ కేసముద్రం లో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత-వెంకన్న

కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైందని, అందులోనూ ఫ్రీ ప్రైమరీ విద్య అనేది పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టని అన్నారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న చిన్నారులకు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ చేతుల మీదుగా పట్టాలను అందజేశారు.

విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. పిల్లల ప్రతిభను ప్రత్యేకంగా వీక్షించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వివేక్, ఎంపీడీవో క్రాంతి కుమారి, సిడిపిఓ శిరీష,కౌన్సిలర్స్ వేముల భారతి,కనుకుల సుభద్ర,వల్లందస్ ఉమా,మేకల శారద,రావుల వినయ్ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సెయింట్ పీటర్స్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే..

ఘనంగా సెయింట్ పీటర్స్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక సెయింట్ పీటర్స్ హైస్కూల్ లో ఘనంగా ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎస్సై జి శ్రావణ్ కుమార్ కారల్ మార్క్స్ కాలనీ 24 వార్డు కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఆటలు పాటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అలాగే చిన్నారులలో ఉన్న విజ్ఞానాన్ని మేధాసంపత్తిని మరింత పెంపొందించుకునే అవకాశం ఉంటుందని వాళ్లకు వివరించడం జరిగింది .అదేవిధంగా చిన్నారులు చదువుతోపాటు ఆటలు, పాటలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి భవిష్యత్తులో భారతదేశ ఉన్నత భావిభారత పౌరులుగా ఎదగాలని దేశ సేవలో ముందుండాలని ఆకాంక్షించడం జరిగింది.
చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి వారు అన్నారు
ఈ కార్యక్రమంలో సెయింట్ పీటర్ స్కూల్ డైరెక్టర్ జార్జి కరస్పాండెంట్ జోసెఫ్ ప్రిన్సిపాల్ జానీ సెర్లీ జార్జ్ ,బినా సిస్లి అధ్యాపక బృందం, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో వసంత పంచమి పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో అంగన్వాడీ టీచర్లు ఎన్.అనిత,డి.సంపూర్ణ, డి.వినోద,ఆయాలు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version