. అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య.

. అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ ఎన్నిక. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య.

మొగుళ్ళపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోనిగుడిపహాడ్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొనిఆరోగ్యలక్ష్మి కమిటీ మెంబర్స్ ని ఎన్నుకొని మీటింగు నిర్వహించడం జరిగింది. చైర్మన్గా సర్పంచ్ కుమ్మరి సాంబయ్య ఆరోగ్య లక్ష్మి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యముఅంగన్వాడీ కేంద్రంలో జరిగే సేవలు గూర్చి మరియు ఆహార పదార్థాల పంపిణీ, అనుబంధ పోషకాహారం, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, 1000 రోజుల ప్రాముఖ్యత గురించి ఆరోగ్య సేవలు మరియు గర్భిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిశోర బాలికలకు చిక్కి ప్యాకెట్స్ , ఇమినైజేషన్ ,పూర్వ ప్రాథమిక విద్య ,విషయాల గూర్చి చర్చించుకోవడం జరిగింది. సర్పంచ్ , ఉప సర్పంచ్ గ్రామస్తులు,పెద్దలందరూ అంగన్వాడీ స్థలం కోసం చర్చించుకోవడం జరిగింది.ఈ కమిటీకి కన్వీనర్ గా అంగన్వాడి టీచర్ ఉంటారు.మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గర్భిణీలు ,బాలింతలు ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లల తల్లులు, మూడు నుండి ఆరు సంవత్సరముల పిల్లల తల్లులు ,కిశోర బాలికలు,, అంగన్వాడి టీచర్ పద్మ, వివో సభ్యులు ఆశా వర్కర్ , సునీత,ఆయా,తల్లులు పాల్గొన్నారు

ముత్యంపేట అంగన్వాడిలో వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాసాలు

ముత్యంపేటలో వసంత పంచమి పురస్కరించుకొని అంగన్వాడి పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు
మల్లాపూర్ జనవరి 23 నేటి ధాత్రి

 

మండలంలోని ముత్యంపేట అంగన్వాడి పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అంగన్వాడి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సర్పంచ్ తేలు నరేష్ పలకలు,బలపాలు నోట్ బుక్స్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, సర్పంచు తేలు నరేష్, ఉపసర్పంచ్ వంగ పోతయ్య, పంచాయతీ కార్యదర్శి మోబిన్, హనుమాన్ల అభిలాష్, అంగన్వాడి టీచర్లు ఆమెటి శ్రీలత, దాసరి లక్ష్మి, సుద్దాల కృష్ణవేణి తోపాటు పలువురు పాల్గొన్నారు.

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం కేంద్రంలో ని నాలుగవ ,ఐదవ కేంద్రం అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, జ్యోతి ఏర్పాటు చేసిన ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశమునకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ హాజరైనారు. ముందుగా ప్రజా ప్రతినిధులను శాల్వాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని జయప్రద సూపర్వైజర్ హాజరై కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆట,పాట, కథ ద్వారా క్రమశిక్షణతో కూడిన ఎల్కేజీ, యూకేజీ నర్సరీ సంబంధించిన విద్యను బోధించి ప్రైమరీ స్కూల్ కు సంసిద్ధులుగా తయారు చేయడం, రుచిగా, వేడిగా, క్వాలిటీ, క్వాంటిటీ ప్రకారం తల్లులకు, పిల్లలకు భోజనం పెట్టడం పిల్లల బరువులు తీయడం, లోప పోషణ గుర్తించడం బాలమృతం, ఎగ్స్ పంపిణీ చేయడం, కిశోర బాలికలకు, పల్లి పట్టీలు ఇవ్వడం, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, దత్తత, అనాధ బాలబాలికలను గుర్తించి హాస్టల్లో చేర్పించడం జరుగుతుందని వివరించారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అప్పుడే పిల్లలందరూ అన్ని రంగాలలో ముందంజలో ఉంటారని వివరించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ కేంద్రాలలో ఎటువంటి సమస్యలు ఉన్న, అవసరాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపినారు. వారి చేతుల మీదుగా ముగ్గురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పల్లి పట్టీలు, బాలమృతం పంపిణీ చేయనైనది. వార్డు మెంబర్స్ తౌటమ్ నవీన్ మైదం శ్రావ్య ఏఎన్ఎం సుమలత , ఆశ వర్కర్ అధిక సంఖ్యలో మహిళలు కిశోర బాలికలు హాజరైనారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version