బాలాజీ విద్యాసంస్థల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

బాలాజీ విద్యాసంస్థల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒకటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాల,అక్షర పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల్లో నెలకొని ఉన్న శ్రీ సరస్వతిదేవి ఆలయంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకలలో బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్
వనజ సరస్వతిదేవి యొక్క విశిష్టతను తెలియజేశారు.సకల విద్యా స్వరూపిణి సరస్వతిదేవి అని ఆమె కృపా కటాక్షములు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి ఓంకారాన్ని దిద్దించారు. విద్యార్థులందరూ పుస్తకాలను ,కళములను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించారు.
ఈ కార్యక్రమంలో విద్యాలయాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి గౌడ్,భవాని,ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముత్యంపేట అంగన్వాడిలో వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాసాలు

ముత్యంపేటలో వసంత పంచమి పురస్కరించుకొని అంగన్వాడి పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు
మల్లాపూర్ జనవరి 23 నేటి ధాత్రి

 

మండలంలోని ముత్యంపేట అంగన్వాడి పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అంగన్వాడి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సర్పంచ్ తేలు నరేష్ పలకలు,బలపాలు నోట్ బుక్స్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, సర్పంచు తేలు నరేష్, ఉపసర్పంచ్ వంగ పోతయ్య, పంచాయతీ కార్యదర్శి మోబిన్, హనుమాన్ల అభిలాష్, అంగన్వాడి టీచర్లు ఆమెటి శ్రీలత, దాసరి లక్ష్మి, సుద్దాల కృష్ణవేణి తోపాటు పలువురు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version