భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన…

భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జహీరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు జనాలను విసుగు చెందిస్తున్నాయి. గురువారం ఝరాసంగం మండలంలో ఉదయం 8 గంటల నుంచే వర్షం కురుస్తుండటంతో, కోతకు వచ్చిన పంటలను ధాన్యంగా మార్చే ప్రక్రియకు అంతరాయం కలిగి, చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాసంగి వరి కోతలపై రైతులకు అవగాహన

• నాణ్యత ప్రమాణాలు పాటించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట,నేటి ధాత్రి 

యాసంగి వరి కోతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వివిధ గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడారు… రైతులు యాసంగి కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్ లో ఉండే ఫ్యాన్ బెల్ట్ యొక్క వేగం 18 – 20 ఆర్ పి యం ఉంచడం ద్వారా తాలు గింజలు ధాన్యంలో రాకుండా నివారించవచ్చున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే సమయంలో తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రమ్య, శ్రీలత, మౌనిక, వివిధ గ్రామాల రైతుల ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version