మానవత్వాన్ని చాటుకున్న మహిళ
మొగుళ్లపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్వహిస్తున్న జాతరలో జమ్మికుంటకు చెందిన ఒక మహిళ పర్స్ తో పాటు 5 వేల రూపాయలను పోగొట్టుకుంది. పోగొట్టుకున్న పర్సు మరో మహిళకు దొరికింది. దీంతో ఆ మహిళ దొరికిన పర్సు తో పాటు 5 వేల రూపాయలను జాతర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డికి అప్పగించింది. దొరికిన పర్స్ తో పాటు 5 వేల రూపాయలను అప్పగించి మానవత్వాన్ని చాటుకున్న ఆ మహిళను మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి, చదువు మహిపాల్ రెడ్డి, వడ్జే ఆనంద్ రావు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు మల్సాని నర్సింగరావు, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
