అమ్మవార్లకు పుస్తె, మట్టెలను మొక్కు తీర్చుకున్నముల్కలపల్లి సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్ దంపతులు మొక్కుకున్న పుస్తె, మట్టెలను జాతర ఉత్సవ కమిటీ కార్యదర్శి చదువు అన్నారెడ్డి సమక్షంలో అమ్మవార్లకు బహుకరించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ గా తాను గెలిస్తే సమ్మక్క-సారలమ్మలకు పుస్తె, మట్టెలను బహుకరిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. అమ్మవార్ల అనుగ్రహంతో తాను గెలిచానని, తాను మొక్కుకున్నట్లుగానే అమ్మవార్లకు పుస్తె, మట్టెలను బహుకరించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి, చదువు మహిపాల్ రెడ్డి తదితరులున్నారు.
