నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో అధికారులకు సన్మాన కార్యక్రమం…

నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో అధికారులకు సన్మాన కార్యక్రమం

రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా

రామన్నపేట ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు
చేయాలని రామన్నపేట సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు
ఈ ప్రాంతం యొక్క చరిత్రను వివరిస్తూ అధికారులుగా
వారి యొక్క సహకారం ఉండాలని సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత నియోజకవర్గమైన రామన్నపేట ను పరిగణలోకి తీసుకోవాలని నియోజకవర్గానికి కావలసిన అన్ని రకాల ఆఫీసులు ఉన్నాయి. నియోజకవర్గ ఏర్పాటుకు మండలంలో ఉన్న అన్ని రకాల అధికారుల సహకారం కూడా అవసరం తప్పకుండా ఉంటుంది ప్రభుత్వానికి నివేదిక ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది వారి సహకారం తప్పకుండా ఉండాలని ఒకప్పుడు రామన్నపేట నియోజకవర్గం లో ఎంతోమంది గొప్ప నాయకులు అధికారులు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఈ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలను నియోజకవర్గo ఏర్పడితే అభివృద్ధికి కావలసిన వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటుకు అధికారుల అవసరం తప్పకుండా ఉండాలని నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో
రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లుకు రామన్నపేట ఎస్సై డి నాగరాజుకు రామన్నపేట చరిత్రను వివరిస్తూ వారి యొక్క సహకారం ఉండాలని వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి. లింగయ్య వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎస్.కె చాంద్ ఎర్ర రమేష్ గౌడ్
నియోజకవర్గ సాధన సమితి నాయకులు వర్తక వ్యాపార సంఘం నాయకులు పోతరాజు శంకరయ్య, తెలంగాణ ఉద్యమ నాయకులు రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ గంగాపురం యాదయ్య గౌడ్, పిఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు వరికల్ గోపాల్, టిడిపి మండల అధ్యక్షులు ఎండి ఫజల్, దళిత రత్న అవార్డు గ్రహీత తెలంగాణ ఉద్యమకారులు గడ్డం యాదగిరి తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ నకిరేకంటి అశోక్
బిజెపి మండల నాయకులు ఏలూరు రవి, బీఎస్పీ మండల అధ్యక్షులు నకిరేకంటి నరేష్,
సాధన సమితి నాయకులు పెండం. రవీందర్ బర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version