మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లకు సన్మానం
మెట్ పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి
మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి ని వైస్ చైర్మన్గా నియమితులైన ఓంకారి నవీన్ ని 23వ వార్డు కౌన్సిలర్ గా కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ ని నూతనంగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా సంఘ భవనంలో సంఘ అధ్యక్షులు కొండ మురళి సంఘ సభ్యులు వారిని ఘనంగా శాలువతో సన్మానం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మీ అందరి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా నియమితుల కావడం సంతోషకరమని మీకు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు ఎప్పుడైనా రావచ్చని మీకు ఎల్లప్పుడు సహాయ సహకారం అందిస్తానని అలాగే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ అధ్యక్షులు కొండ మురళి కార్యదర్శి ఇంద్రాల ఈశ్వర్ కోశాధికారి మద్దే నపల్లి స్వామి ఉపాధ్యక్షులు ఎదులాపురం కుమార్ గౌరవ అధ్యక్షులు కొడిమ్యాల వెంకటస్వామి మ్యాడపు అశోక్, గడిపల్లి నారాయణ భూమేశ్వర్ చంద్రగిరి రామకృష్ణ మ్యాడపుశ్రీనివాస్,రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
