ఎట్టకేలకు జహీరాబాద్…మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం
◆-: మున్సిపల్ ఛైర్మన్ గా మహమ్మద్ యూనుస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరిష..
◆-: కాంగ్రెస్ ఖాతాలోకి జహీరాబాద్, కోహీర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు..
◆-: రెండు మున్సిపాలిటీలల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎట్టకేలకు జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠకు తెరపడింది. కోరమ్ లేక సోమవారం నాడు వాయిదా పడిన ఈ ఎన్నిక చివరకు మ్యాజిక్ ఫిగర్ రాజకీ యాలతో ముగిసి మంగళ వారం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వివరాలలోకి వెళితే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సి పాలిటీలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 స్థానాలు గెలుచుకోగా, జహీరాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ లు ఈ మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా నమోదు కావడంతో మొత్తం 39 మంది సభ్యులు కాగా, చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20 సభ్యుల మద్దతు దక్కించుకోవడం కీలకంగా మారింది. సోమవారం నాడు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరమ్ లేక ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలతో కలిసి ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిపి 19 మందితో బిఆర్ఎస్ మద్దతు కూడగట్టగా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఇద్దరు, ముగ్గురు స్వతంత్రులను తమవైపు తిప్పుకుని ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరుకోగా, ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 15 వ వార్డు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్ మహమ్మద్ యూనుస్ చైర్మన్ గా, 16 వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికైన కొత్త కాపు శిరీష వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు..a
