తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి….

తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి

*10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

నర్సంపేట,నేటిధాత్రి:

వార్డులో తడి చెత్త పొడి చెత్త వేరుచేసి సరిసారాలను పరిశుభ్రంగా ఉంచాలని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హన్మకొండ 10వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై వార్డు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు మోరీలలో చెత్తాచెదారం, ప్లాస్టిక్, పేపర్లు, పాత బట్టలు వేయవద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల మురికి నీరు నిలిచిపడి దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.మున్సిపాలిటీ చెత్త సేకరణ బండిలోనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేయాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దని తెలిపారు. చెత్త బండి సమయానికి రాకపోతే అధికారులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత మున్సిపాలిటీ లేదా ప్రజాప్రతినిధుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వార్డు ప్రజలు అందరూ సహకరించి వార్డును పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ ముదురుకోల నవీన్, 10వ వార్డు అధికారి రహీం పాషా, శానిటరీ జవాన్ భరత్, ఆర్‌పి సువర్ణ, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు కొలువుల వెంకట్, మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు సన్మానం…

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు సన్మానం
మెట్ పల్లి మార్చి
24 నేటి ధాత్రి

మెట్ పల్లి లో ఆటో యూనియన్ బస్ డిపో చౌరస్త రింగ్ రోడ్డు వారి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మైలారపు లింబాద్రి ని వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ ని చైర్మన్ స్వగృహంలో ఘనంగా శాలువా పూలమాలతో సన్మానం చేశారు .అనంతరం చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మీకు వార్డులో సమస్యలు గానీ అలాగే ఏ సహాయ సహకారాలు కావాలన్న ఎల్లప్పుడూ మీముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సంఘ అధ్యక్షులు రంగు సంపత్ గౌడ్ ఉపాధ్యక్షులు భాష్పం నరేందర్ క్యాషియర్ కుడుముల లక్ష్మణ్ సెక్రెటరీ దాసరి బుచ్చయ్య పొన్నం రామచందర్.
ఎం అయిలయ్య.రామ్ రెడ్డి కనకయ్య నారాయణ గౌడ్ రాజ గౌడ్ రాజయ్య ఏసు గంగాధర్ మల్లయ్య రాజు మహేష్ మధు నక్క హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గ ము) జహీరాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొహమ్మద్ యునుస్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ ఛైర్మన్ మరియు నాయకులు.ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనం అన్నారు. మీ మార్గదర్శకత్వంలో జహీరాబాద్ పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, మౌలిక వసతులను మెరుగుపర్చుతూ, ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ పథకాలతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు. విజయవంతంగా , పారదర్శకతతో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము.మీ భవిష్యత్తు కార్యాచరణను మరింత నిబద్దతో ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో బేసి జేఏసీ జహీరాబాద్ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ. అధ్యక్షుడు కొండపురం నర్సిములు,ఉపాధ్యక్షులు శంకర్ సాగర్ ,మైనారిటీ యూత్ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్, భుడగజంగం యువ నాయకులు మాదినం శివ ప్రసాద్, వడ్డెర సంఘం యువ నాయకులు శేఖర్, జయ విజ్ఞాన భారతి సొసైటీ డైరెక్టర్లు బాలక్రిష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో…

మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లకు సన్మానం
మెట్ పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి

 

మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి ని వైస్ చైర్మన్గా నియమితులైన ఓంకారి నవీన్ ని 23వ వార్డు కౌన్సిలర్ గా కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ ని నూతనంగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా సంఘ భవనంలో సంఘ అధ్యక్షులు కొండ మురళి సంఘ సభ్యులు వారిని ఘనంగా శాలువతో సన్మానం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మీ అందరి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా నియమితుల కావడం సంతోషకరమని మీకు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు ఎప్పుడైనా రావచ్చని మీకు ఎల్లప్పుడు సహాయ సహకారం అందిస్తానని అలాగే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ అధ్యక్షులు కొండ మురళి కార్యదర్శి ఇంద్రాల ఈశ్వర్ కోశాధికారి మద్దే నపల్లి స్వామి ఉపాధ్యక్షులు ఎదులాపురం కుమార్ గౌరవ అధ్యక్షులు కొడిమ్యాల వెంకటస్వామి మ్యాడపు అశోక్, గడిపల్లి నారాయణ భూమేశ్వర్ చంద్రగిరి రామకృష్ణ మ్యాడపుశ్రీనివాస్,రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version