అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!!

-రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది?

-అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు!

mlc candidate harikrishna

-ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం

-ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం

-కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం

-కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం

-ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి

-ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది!

-జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే

-ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ

-విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట

అబద్దమాడరాదు..సత్యమునే పలుకవలెను..అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్దాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గౌడ్‌ మాటలు అలాగే వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంత కాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజా సేవ కోసం తన ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశానని, కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా? చాలా గొప్ప వ్యక్తి అన్న భావనే ఏర్పడుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంతలోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులు బాటు వుంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన వుండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడేమో? అని జనం ఆలోచిస్తుంటారు. కాని అదంతా నిజంకాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంత కాలంగా చిన్నా చితక సామాజిక కార్యాక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతమెంత? అందులో చేసే ఖర్చెంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో పది మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే…కాని మన సమాజంలో ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్త దానాలు చేస్తున్న వారు అనేక మంది వున్నారు. వాళ్లెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్యా, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కాని రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితక సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకొని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిననాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరునాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్‌గా మార్చుకొని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అదికార కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని పదిహేనేళ్లు లేదు. రిటైర్‌ మెంటుకు దగ్గరకూడా లేరు. కాని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్‌ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కాని ఇంకా ఎంతో ఉద్యగ భవిష్యత్తు వున్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి, ప్రజలను నమ్మించి రాజకీయాల్లో వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా రెండేళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువొస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదొ కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు అనేక మంది వున్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు. ప్రజలను మోసం చేయడం. అద్యాపక వృత్తిలో వుంటూ నీతి, నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్దాల పునాదుల మీద, అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయ స్దానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్లు ప్రజలను మోసం చేయకుండా వుండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని, వారు కోరినంత ముట్ట జెప్పి, కోర్టును కూడా ప్రబావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్దమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీకి నామినేషన్‌ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బిసినంటూ బిసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బిసిలను సంఘటితం చేసి విజయం సాధిస్తాననుకున్నారు. కాని అటు వంటి దారి ఎక్కడా కనిపించలేదు. దాంతో రాత్రికి రాత్రి బిఎస్పీ కండువా కప్పుకున్నారు. బిఎస్పీ కార్యకర్తలైన పట్టుబద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బిసి పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిసి కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చూపించుకుంటున్నారు. ఈ రెండిరటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి వుంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా, అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్‌ సెంటర్లన్నీ కళకళలాడుతుండేవి. కోచింగ్‌ సెంటర్లు కూడా ఇదిలో ఈ నోటిఫికెషన్‌ వచ్చే, ఆ నోటిఫికేషన్‌ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్‌ సెంటర్లప్రచాం మొదలు పెట్టేవి.తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని గత బిఆర్‌ఎస్‌పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్దఎత్తున నగరాలకు చేరుకుంటూ వుండేవారు. ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఉమ్మడిజిల్లాల కేంద్రాలలో పెద్దఎత్తున వెలసిన కోచింగ్‌ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్‌ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్‌ సెంటర్లబొచ్చేలో రాయి వేసినట్లైంది. కోచింగ్‌ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్‌ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్ధితి విచ్చింది. ఆ మధ్య డిఎస్సీ, గ్రూప్‌ వన్‌ ల మీద పెద్దఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్‌ సెంటర్లు, అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్లమీదకుతెచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్‌ సెంటర్ల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. ఇకపై ప్రభుత్వం తమ చెఫ్పుచేతుల్లో వుండాలన్న ఆలోచనతో కోచింగ్‌ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి, హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్‌ పార్టీనుంచి టికెట్‌ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓ వైపు కాంపిటీటివ్‌ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ , అదనపు ఆదాయం సమకూర్చుకుంటుంటారు. కోచింగ్‌ సెంటర్లకు ద్వారా వాటిని అమ్ముకుంటుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్‌ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్‌ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కాని హరికృష్ణ ఆశలు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్‌ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్‌ సెంటర్లు వుండడంతో ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేశారు. బిఎస్పీ కండువా కంప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్య వంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు..విద్యలు..ఎత్తులు..జిత్తులు…కథలు…నటనలు..సానుబూతి పవనాలు. .ఇన్ని దాగి వుంటాయి. కాని కొన్ని ఎన్నికలు అలా వుండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతిగా, నిజాయితీ వుండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్దలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది పట్టభద్రులే…

జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నీ గెలిపించండి.

బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి.

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది, ఇట్టి కార్యక్రమం లో మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి మాట్లాడుతూ
కరీంనగర్, మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని కోరడం జరిగింది. మరియు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపియగలరని కోరారు, ఈ గెలుపు తో రానున్న స్థానిక సంస్థలలో బీజేపీ పార్టీ విజయం కాయమని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం లో అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు
ఇట్టి కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం నాయకురాలు భోగ శ్రావణి, మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు,

ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతుంది

– ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్

– బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనీ కె కన్వెన్షన్ హాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ,
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.ఈ ఎన్నిక 42 అసెంబ్లీ నియోజకవర్గలలో జరుగుతున్న ఎన్నికని అన్నారు.గ్రామాల్లో ఉన్న పట్టభద్రులకు 50 మందికి ఒకరిని ఇంచార్జి గా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు పోవాలని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ వేస్తే మళ్ళీ ప్రజా ప్రభుత్వంలో డీఎస్సీ వేయడం జరిగిందని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల లో ఇచ్చిన ఉద్యోగాలను మనం పది నెలల్లో ఇవ్వడం జరిగిందని అన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో లేకుండా బీజేపీ తో ఒక లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
ఆనాడు రాష్టప్రతి ఎన్నికల్లో, నల్ల చట్టాల అమలు సమయంలో బిఆర్ఎస్ బీజేపీ కి మద్దతు ఇచ్చారని అన్నారు.
బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ అన్న విధంగా ఉందని అన్నారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు రావడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ అన్నారు.
మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కష్టపడితే మీకు మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతాయని అన్నారు.
మండలాల వారిగా గ్రామాల వారిగా ప్రతి ఒక్కరు కష్టపడాలని అన్నారు.
బూతుకు ఒక ఇంచార్జి పెట్టీ ఎన్నికలో ముందుకు పోవాలని అన్నారు.
ఎన్నికల రోజు బూతు ఇంచార్జిలు ఇతర ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులు వచ్చి ఓటు వేసేలా చూడాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ వివరించాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని అన్నారు.
బిఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీన పడ్డది కాబట్టి నేడు పోటీలో లేదని అన్నారు.
బల్మూరి వెంకట్ ప్రతిపక్షంలో అనేక ఆందోళనలు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై అనేక అక్రమ కేసులను పెట్టారని అన్నారు.
నేడు ప్రజా ప్రభుత్వంలో టిఆర్ఎస్ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.
ఆనాడు కేటీఆర్ సిరిసిల్ల కి వస్తె నేరేళ్లలో ముళ్ళ కంచెలు వేసేవారని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు.

‌నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు..

అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు.

సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను.

వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను.

రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు.

నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు.

నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌

మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు.

సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను.

ఎమ్మెల్సీ “పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి”.

“నేటిధాత్రి”, హైదరాబాద్.

తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజా ప్రతినిధిగా 20 సంవత్సరాల పాటు మచ్చలేని నాయకుడు, వివాద రహితుడిగా పేరు సంపాదించుకున్నాను. మొయినాబాద్ మండల తోల్కట్డ గ్రామంలో నాకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంఘటనకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. 2018 ఆ భూమి కొనుగోలు చేసిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలను నా మేనల్లుడు జాన్‌దేవ్ రెడ్డికి అప్పగించాను. ఇక్కడ మరో ముఖ్య విషయం. నా వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి నిర్మాణాలు లేవు. కేవలం వ్యవసాయ కూలీలు సేదదీరడం కోసం వేసిన రేకుల షెడ్లు మాత్రమే వున్నాయి. నా వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి తోట, మామిడి తోటలున్నాయి. నిరంతరం వ్యవసాయ పనుల కోసం వాడే పని ముట్లు దాచడం కోసం రేకుల షెడ్లు వినియోగిస్తారు. అక్కడ గెస్ట్ హౌస్ లేదు. ఫామ్ హౌస్ లేదు. కానీ కొందరు పని గట్డుకొని అసత్యాలన్నీ ప్రచారం చేస్తున్నారు.‌ కాకపోతే మా మేనల్లుడు నా సమాచారం లేకుండా సదరు తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు మాత్రమే తెలిసింది. అయితే రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మరో వ్యక్తి ఎం. వెంకట పతి రాజుకు కౌలుకిచ్చారని నిన్ననే నా దృష్టికి వచ్చింది. వెలుగులోకి వచ్చిన విషయంలో సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా నేను స్వయంగా నిన్ననే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను. వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు. నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు. నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌ అయితే మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు. సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను. అని పోచంపల్లి తెలిపారు.

వివాహ వేడుకకు హజరైన…. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.

గద్వాల /నేటి ధాత్రి

గద్వాల్ జిల్లా కేంద్రంలోని జరిగిన అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీచ్ పెల్లి కుమార్తె మేఘన, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు బల్గెర గ్రామానికి చెందిన బాసు సవారయ్య కుమారుడు బసు గోపాలకృష్ణ వివాహ వేడుక కె.యస్. ఫంక్షన్ హాల్ లో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా.. శుక్రవారం జరిగింది. వివాహ వేడుకకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి హాజరై నూతన వధూవరులకు తలంబ్రాలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version