ముగిసిన పుర ఎన్నికలు…

ముగిసిన పుర ఎన్నికలు…

ప్రశాంత వాతావరణం లో ముగిస్తున్న మున్సిపల్ ఎన్నికలు

ఎంతో ప్రాయాస పడుతూ ఓట్లలో పాల్గొన్న వికలాంగులు… వృద్ధులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసాయి ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని పార్టీల నాయకులు సవ్యమనం పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించారు. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నట్టు కనబడుతుంది ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క ఓటరు కేసముద్ర మున్సిపాలిటీ అభివృద్ధి కొరకై తమ ఓటును వేసి మద్దతు తెలిపినట్టు వినపడుతుంది. ఎన్నికలు అయితే ముగిసాయి కానీ ఎవరికి పట్టం కడతారో అనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో పోటాపోటీగా ఎన్నికలు జరిగినట్టు సమాచారం. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎవరికి విజయం వరిస్తుందో ఎవరికి అపజయం వరిస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతుందని పలువురు భావిస్తున్నారు. పలువురు నాయకులు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఎవరికి వారు ఎన్ని చెప్పుకున్నా ప్రజల తీర్పే తుది తీర్పు ఆ తీర్పు వెలుపడే సమయం ఒక్కరోజు కన్నుమూస్తే మర్నాడు ఎవరి జాతకాలు ఏంటనేది తేలిపోతుంది అప్పటిదాకా అభ్యర్థులకు నాయకులకు కంటిమీద కు నుకు పట్టిన ప్రజలు మాత్రం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నట్టు కనపడుతుందని భావిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి ఓటర్ల నాడి ఎవరు ఊహించలేని విధంగా తీర్పు ఇచ్చేలా ఓటర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో ఎవరిని విజయం వరిస్తుందో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే శుక్రవారం 13వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.

కోహీర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు…

కోహీర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, సీనియర్ నాయకులు కలిమ్, యువ నాయకులు మిథున్ రాజ్ కోహీర్ పట్టణం లోని వివిధ వార్డ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ నాయకులు మాట్లాడుతూ ,ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు, బి ఆర్ ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులు వేసి మేమే చేసాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు,ప్రజల ఆశీస్సులతో కోహీర్ గడ్డ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు,నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు..

ముగిసిన నామినేషన్ల పర్వం.

ముగిసిన నామినేషన్ల పర్వం

* 24 బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, జనవరి 30( ప్రజా జ్యోతి న్యూస్ )పట్టణ పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో 24 వార్డ్ బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ నామినేషన్ దాఖలు చేశారు. వారి వెనుక బిజెపి నాయకుడు పాలెంకర్ సంతోష్ కాలోని వాసులు పాల్గొన్నారు అని తెలియజేశారు. అనంతరం చివరి రోజు(శుక్రవారం) కావడంతో పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలు, బాజాభజంత్రీలతో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. అభ్యర్థుల మద్దతుదారులతో పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. పోలీసులు ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వ హించారు. అభ్యర్థి తోపాటు పాలిoకార్ మహేష్, చిరంజీవి, డప్పు విజయ్, సంతోష్ తదితరులు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడం తో పట్టణంలో ప్రచార పర్వం ఊపందు కోనుంది.

కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి, ముల్కలపల్లి జాతరలో, జిల్లా కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మొగుళ్లపల్లి ఎంపీడీవో పోస్టర్ ఆవిష్కరించారు. మిషన్ కోఆర్డినేటర్ క్రిష్ణ మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. జెండర్ స్పెషలిస్ట్ శ్రీమతి అనూష బాలికల రక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రజలతో బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం కింద అవగాహన పంప్లేట్లను పంపిణీ చేశారు. జాతరలో సుమారు 5,000 మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మహిళా సాధికారత, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా బలపరిచిన నలుగురు అభ్యర్థులతో పాటు 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్ధులను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపీఐ జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్ర వారం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన సందర్భంగా స్థానిక కొమురయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు.. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అధికార పార్టీతో పొత్తుపెట్టు కోవడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మున్సిపల్ అభివృద్దిని కోరి ఉమ్మడి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టు కోవడం జరిగిందని స్పష్టం చేశారు. నాలుగు వార్డులలో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థులతో పాటు పొత్తు దర్మాన్ని పాటిస్తు 30 వార్డులలో అధిక కౌన్సిలర్ అభ్యర్ధులను గెలిపించుకొని మున్సివల్ చైర్మన్ వడవిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని రాజ్ కుమార్ తెలిపారు.

సిపిఐ నుండి నామినేషన్ వేసిన కౌన్సిలర్ అభ్యర్థులు వీరే :

భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు 2వ సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.ఈ మున్సిపల్ ఎన్నికలో ఉమ్మడి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పొత్తు కుదిరి సిపిఐకి 5,7,24,28 నాలుగు వార్డులు, సిపిఎంకి 27 ఒక్క వార్డును కేటాయించారు.అందు భాగంగా సిపిఐ నుండి 5వ వార్డులో గంగ సరం శ్రీనివాన్, 7వ వార్డులో నూకల భూలక్ష్మీచంద్రమౌళి, 24 వార్డు వేముల జ్యోతి శ్రీకాంత్,28 వార్డు సౌత్కు ప్రవీణ్ కుమార్ లు శుక్ర వారం నాలుగు వార్డుల్లో నామినేషన్ వేశారు. అట్లాగే 27 వార్డు సీపీఎం నుండి ఎర్రం అనూష సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.వీరుపార్టీకోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది.గత మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులు సిపిఐ గెలుచుకోగా, ఈ సారీ మున్సిపల్ ఎన్నికల్లో 4 వార్డులు ఖచ్చితంగా సిపిఐ గెలుచుకునే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version