భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ…

భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం జడ్పి ఉన్నత పాఠశాల, హనుమాన్ నగర్‌లోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 52,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని తెలిపారు. వీరిలో 26,786 మంది పురుషులు, 25,936 మంది మహిళలు, ఇతరులు 4 మంది ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 30 వార్డులకు 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 104 మంది ప్రెసైడింగ్ అధికారులు, 104 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు, 312 మంది ఇతర పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు.

అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. 86 పోలింగ్ కేంద్రాల్లో 149 వెబ్‌కాస్టింగ్ యూనిట్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. కొన్ని కేంద్రాల్లో లోపల మరియు బయట రెండు చోట్లా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి…

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్

ఎన్నికల నిర్వహణకు 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో సెక్షన్ 163 BNSS 144 సెక్షన్ అమలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ తెలిపారు.
ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ నరేష్ కుమార్ ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రాముఖ్యత, విధుల నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, సిబ్బంది చేయవలసిన చేయకూడని అంశాలపై అడిషనల్ ఎస్పీ సమగ్రంగా వివరించారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది.ఇందులో 26 లొకేషన్స్ ఉన్నాయి. ఎన్నికల భద్రత కోసం 450 మంది పోలీసు సిబ్బందిని నియమించడం జరిగింది. పోలింగ్ సామగ్రిని పటిష్ట ఎస్కార్ట్‌తో తరలించేందుకు 8 రూట్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి రెండు రూట్లకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రతి నాలుగు రూట్లకు డీఎస్పీ స్థాయి అధికారి తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, సీఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ టీమ్స్, రూట్ మొబైల్స్ మరియు బ్లూ కోర్ట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, పది మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, మిగతా పోలీస్ సిబ్బంది ఉన్నారు
ఎన్నికల సందర్భంగా పోలీసుల విధి విధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలిపారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు,ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డిఎస్పి సూర్యనారాయణ,సిఐలు ఆర్‌ఐ, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జర్నలిస్టు దంపతులకు అండగా నిలిచిన మీడియా లోకం…

జర్నలిస్టు దంపతులకు అండగా నిలిచిన మీడియా లోకం

యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్ నాయకుల ఏకగ్రీవ మద్దతు

సుత్తి కొడవలి నక్షత్రం’ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ ఎర్రం అనూష సతీష్ కుమార్ విజయానికి జర్నలిస్టు లోకం ఏకమైంది. శుక్రవారం 27వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెకు మద్దతుగా తోటి జర్నలిస్టులు పైలెట్ కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
పార్టీలు, యూనియన్లకు అతీతంగా తరలివచ్చిన జర్నలిస్టులు.. తమ తోటి జర్నలిస్ట్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో పాల్గొన్న కాకతీయ ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… ప్రజల సమస్యలను నిత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు నేడు నేరుగా ప్రజా సేవలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. “అనూష సతీష్ కుమార్ గెలిపిస్తే, జర్నలిస్టులందరం కలిసి ఎమ్మెల్యే తో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకువస్తాం. పైలెట్ కాలనీతో పాటు 27వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం” అని ఓటర్లకు భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న విద్యావంతురాలైన అనూష సతీష్ కుమార్‌ను గెలిపించడం ద్వారా వార్డు రూపురేఖలు మార్చుకోవచ్చని వారు నినదించారు. సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఖ్యాతం సతీష్ కుమార్, సామంతుల శ్యామ్, జల్ది రమేష్, ఎడ్ల సంతోష్, అంబాల సంపత్, తడుక సుధాకర్, గుజ్జ సారేశ్వరరావు, రవీందర్,
ములకల లక్ష్మారెడ్డి, చెరుకు సుధాకర్, సమ్మయ్య, కడపాక రమేష్,కొంకుల
సాంబయ్య, వెంకన్న,ప్రవీణ్, రజినీకాంత్, రాంబాబు,
జగన్, పవన్, చంద్రమౌళి, సృజన్, సుమారు 50 మంది సీనియర్ జర్నలిస్టులుపాల్గొన్నారు.

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా కన్నం యుగదీశ్వర్…

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా కన్నం యుగదీశ్వర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 4వార్డ్ బిజెపి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కన్నం యుగదీశ్వర్ యుగేందర్ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగో వార్డ్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించండి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను నాలుగో వార్డు పక్కకు వారం సంతను తీసుకువస్తాను ప్రతి వార్డుకు ఒక బోరు వేసి నీటి సౌకర్యం కల్పిస్తాను కాలనీ సమస్యలను అన్నిటిని పరిష్కరిస్తానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలి ఎమ్మెల్యే జిఎస్ఆర్…

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలి ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో సీపీఐ, సీపీఐ(యం)పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 30 వార్డులు ఎల్బీ నగర్, రెడ్డి కాలనీ, బానోత్ వీధి, సత్తార్ నగర్ కాలనీలల్లో సీపీఐ , సీపీఐ(యం)పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు మరియు ఆయా వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అందుకు కాంగ్రెస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతి ఇంటి గడపను తట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తోందని తెలిపారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి ఇప్పటికే చేపట్టిన పలు కార్యక్రమాలను కొనసాగిస్తూ, మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అత్యంత అవసరమని అన్నారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, పేదల సంక్షేమం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసినట్లయితే భూపాలపల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పదేళ్లు పాలించిన వాళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలకు సరైన నిధులు కేటాయించకపోవడం, అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. ఎన్నికలు వస్తే హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని గాలికి వదిలేయడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని పార్టీకి ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపాలిటీలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు బీఆర్‌ఎస్ మోసపూరిత రాజకీయాలను గుర్తించి, అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనూషను గెలిపించండి…

సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనూషను గెలిపించండి

సిపిఐఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో కాంగ్రెస్,సిపిఐ సిపిఐఎం కూటమి అభ్యర్థి ఎర్రం అనూషను సుత్తే కొడవలి చుక్క గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు
సోమవారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డు లోని హైటెక్ కాలనీ, రెవెన్యూ కాలనీ,సత్తార్ నగర్,జవహర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ… ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి మున్సిపాలిటీని అత్యాధునిక అంగులతో భవిష్యత్తు తరాలకు అనుగుణంగా భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి ప్రజలు తమ వంతుగా ఓటు హక్కుతో 27వ వార్డు అభ్యర్థిని ఎర్ర ఆనుషను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఎర్రం సతీష్ కుమార్,ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు వంగాల లక్ష్మి,సంఘం ప్రీతి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్,సిపిఎం నాయకులు రాజేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి, ముల్కలపల్లి జాతరలో, జిల్లా కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మొగుళ్లపల్లి ఎంపీడీవో పోస్టర్ ఆవిష్కరించారు. మిషన్ కోఆర్డినేటర్ క్రిష్ణ మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. జెండర్ స్పెషలిస్ట్ శ్రీమతి అనూష బాలికల రక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ప్రజలతో బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం కింద అవగాహన పంప్లేట్లను పంపిణీ చేశారు. జాతరలో సుమారు 5,000 మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మహిళా సాధికారత, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్–కమ్యూనిస్టు అభ్యర్థులకు భారీ విజయం కావాలి

కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా బలపరిచిన నలుగురు అభ్యర్థులతో పాటు 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్ధులను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపీఐ జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్ర వారం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన సందర్భంగా స్థానిక కొమురయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు.. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అధికార పార్టీతో పొత్తుపెట్టు కోవడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మున్సిపల్ అభివృద్దిని కోరి ఉమ్మడి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టు కోవడం జరిగిందని స్పష్టం చేశారు. నాలుగు వార్డులలో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థులతో పాటు పొత్తు దర్మాన్ని పాటిస్తు 30 వార్డులలో అధిక కౌన్సిలర్ అభ్యర్ధులను గెలిపించుకొని మున్సివల్ చైర్మన్ వడవిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని రాజ్ కుమార్ తెలిపారు.

సిపిఐ నుండి నామినేషన్ వేసిన కౌన్సిలర్ అభ్యర్థులు వీరే :

భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు 2వ సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.ఈ మున్సిపల్ ఎన్నికలో ఉమ్మడి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పొత్తు కుదిరి సిపిఐకి 5,7,24,28 నాలుగు వార్డులు, సిపిఎంకి 27 ఒక్క వార్డును కేటాయించారు.అందు భాగంగా సిపిఐ నుండి 5వ వార్డులో గంగ సరం శ్రీనివాన్, 7వ వార్డులో నూకల భూలక్ష్మీచంద్రమౌళి, 24 వార్డు వేముల జ్యోతి శ్రీకాంత్,28 వార్డు సౌత్కు ప్రవీణ్ కుమార్ లు శుక్ర వారం నాలుగు వార్డుల్లో నామినేషన్ వేశారు. అట్లాగే 27 వార్డు సీపీఎం నుండి ఎర్రం అనూష సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.వీరుపార్టీకోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది.గత మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులు సిపిఐ గెలుచుకోగా, ఈ సారీ మున్సిపల్ ఎన్నికల్లో 4 వార్డులు ఖచ్చితంగా సిపిఐ గెలుచుకునే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version