రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గ్రీన్ వుడ్ విద్యార్థులు
కృషి,పట్టుదలతోనే, అవకాశాలు అందుతాయి
కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి
రాయికల్ అక్టోబర్ 15 , నేటి దాత్రి:
మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిలు పోతరాజు అద్విత 8వ తరగతి మరియు పంచతి మధుప్రియ లను గ్రీనువుడ్ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయి కరీంనగర్ అండర్ 14 కబడ్డీ గర్ల్స్ విభాగం పెద్దపల్లిలో పోటీలు జరిగాయి అందులో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది దీనిలో అత్యధిక ప్రతిభ కనబరిచిన అద్విత, మధుప్రియలు సంగారెడ్డి పటాన్చెరువులో జరిగే క్రీడలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాకర శ్రీనివాస్ రెడ్డి హెడ్మాస్టర్ రాజేష్ ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయవకాశాలు అందుకోవాలని కోరారు.
