పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి
నూతి మల్లన్న స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పి.ఎస్.హెచ్.ఎం.ఏ
ఇబ్రహీంపట్నం. నేటిదాత్రి
ఉద్యోగులకు పి ఆర్సీ ని వెంటనే ప్రకటించి పెండింగ్ లో ఉన్న ఐదు డి.ఏ లను విడుదల చేయాలనీ ప్రైమరి స్కూల్ హెడ్ మాస్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నూతి మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో సోమవారం రాత్రి నిర్వహించిన సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ సమస్యలగురించి విపులంగా చర్చించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించటం జరిగింది. ఈ ఎన్నికలో జిల్లా కమిటీ అధ్యక్షులుగా అచ్చ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శిగా చల్లా లక్ష్మారెడ్డి , గౌరవ అధ్యక్షులుగా జంగా గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసోసియేట్ ప్రెసిడెంట్ గా జరుపుల సుధాకర్,కె. లక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఎం. గంగాధర్,ఆర్. శ్రీనివాస్,జి. రవీందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆర్. కనకతార,సి. హెచ్. వాణి, ఏ. సుజాత మరియు ఆర్థిక కార్యదర్శిగా ఇ. రవీందర్, మీడియా సెక్రెటరీగా డి. భీమయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె. లక్ష్మీనారాయణ, సెక్రెటరీలుగా ఎల్. రాజు, టి. వేణుగోపాల్, కె. తిరుపతి, కె. నాగరాజ్, బి.రెడ్డి, ఎల్. కిష్టయ్య,వి. రవీందర్, మహిళా కార్యదర్సులు గా పి. స్వరూప, ఎం. హేమలత,ఎల్ ధర్మవ్వ స్టేట్ కౌన్సిలర్లు గా ఎస్. నరసయ్య, జె. సుదర్శన్,పి. రమేష్,డి. వెంకటరమణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికైన నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించుట జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూతి మల్లన్న మాట్లాడుతూ పిఆర్సిని ప్రకటించకుండా బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆర్ధికంగా ఇబ్బంది కలిగించటం ప్రభుత్వానికి సరికాదని ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ప్రభుత్వం తక్షణం స్పందించి పి ఆర్సీ మరియు ఐదు డి ఏ లు, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలనీ కోరారు. అలాగే మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు మొత్తం సర్వీస్ కాలంలో వాడుకునే విధంగా వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు సాతల నరసయ్య,డి. శంకర్,నూతన కార్యవర్గ సభ్యులు,జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
