ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి…

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన తపస్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ )భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు,ఉద్యోగులు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పి ఆర్ సి కమిటీ రిపోర్టు ను ప్రభుత్వం తెప్పించుకొని పి ఆర్ సి నీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఇతర పెండింగ్ బకాయిలన్నింటిని త్వరితగతిన ఉపాధ్యాయులకు చెల్లించాలని ఎమ్మెల్యే ను సంఘ నాయకులు కోరారు.
ఉపాధ్యాయులకు,ఉద్యోగులకు , విశ్రాంత ఉద్యోగులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు.
రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటిని ప్రస్తావించి వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొనే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు ములుకల్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర బాధ్యులు మారబోయిన మహేందర్, సంగెం శ్రీనివాస్, రేగొండ డివిజన్ ఇంచార్జి కొడకండ్ల శ్రీకాంత్, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి లకుం రంజిత్ కుమార్, మహాదేవపూర్ మండల అధ్యక్షులు నస్పూరీ సంతోష్ కుమార్,జిల్లా కార్యదర్శిలు గౌరిశెట్టి రవీంద్రనాథ్, మూడికె శ్రీనివాస్, జంగిలి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

పీఆర్టీయు టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…

పీఆర్టీయు టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

సెంటర్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల అధ్యక్షులు గోపాల శ్రీధర్ మాట్లాడుతూ..వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు.ఇప్పటికే చాలా కాలయాపన జరిగిందని, పీఆర్సీ సమయం దాటి రెండు సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటివరకు రావాల్సిన 5 డిఏ లను వెంటనే ప్రకటించాలని గోపాల శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శి బీరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని,పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ,ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహా యింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా బాధ్యులు ఉపాధ్యాయులు శ్రీనివాస్, భాస్కర్, హరినాథ్, గోపాల్, రాహుల్ కుమార్, హరి సింగ్, సత్యనారా యణ,రఫీ భాష, శోభ, పద్మశ్రీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం..

గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలోఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా గణపురం గ్రామ పంచాయతీలో పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.ఈ సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూగ్రామ ప్రజలు మీపై నమ్మకంతో గ్రామాభివృద్ధికి కష్టపడే వారిగ మిమల్ని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ
గ్రామ ప్రజలు ఇచ్చిన ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ తన మన బేధం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్,ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు.గణపురం మండలంలోనిగ్రామపంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా మొదట పూజ కార్యక్రమం ప్రత్యేక పూజ నిర్వహించి సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు నెంబర్లు దేవుని ఆశీస్సులతో తమ పదవి బాధ్యతలను నిర్వహించాలని దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గణపురం ఎంపీడీవో ఆధ్వర్యంలో గణపురం బుద్ధారం గాంధీనగర్ బురకాయల గూడెం మైలారం కర్కపల్లి లక్ష్మిరెడ్డిపల్లి చెల్పూరు గొల్లపల్లి వెంకటేశ్వర పల్లి పరశురాంపల్లి ధర్మారావుపేట్ బ స్వ రాజు పల్లి నగరంపల్లి సీతారాంపూర్ కొండాపూర్ అప్పయ్యపల్లి సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారంచేశారు.

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి..

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి

నూతి మల్లన్న స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పి.ఎస్.హెచ్.ఎం.ఏ

ఇబ్రహీంపట్నం. నేటిదాత్రి

 

ఉద్యోగులకు పి ఆర్సీ ని వెంటనే ప్రకటించి పెండింగ్ లో ఉన్న ఐదు డి.ఏ లను విడుదల చేయాలనీ ప్రైమరి స్కూల్ హెడ్ మాస్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నూతి మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో సోమవారం రాత్రి నిర్వహించిన సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ సమస్యలగురించి విపులంగా చర్చించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించటం జరిగింది. ఈ ఎన్నికలో జిల్లా కమిటీ అధ్యక్షులుగా అచ్చ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శిగా చల్లా లక్ష్మారెడ్డి , గౌరవ అధ్యక్షులుగా జంగా గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసోసియేట్ ప్రెసిడెంట్ గా జరుపుల సుధాకర్,కె. లక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఎం. గంగాధర్,ఆర్. శ్రీనివాస్,జి. రవీందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆర్. కనకతార,సి. హెచ్. వాణి, ఏ. సుజాత మరియు ఆర్థిక కార్యదర్శిగా ఇ. రవీందర్, మీడియా సెక్రెటరీగా డి. భీమయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె. లక్ష్మీనారాయణ, సెక్రెటరీలుగా ఎల్. రాజు, టి. వేణుగోపాల్, కె. తిరుపతి, కె. నాగరాజ్, బి.రెడ్డి, ఎల్. కిష్టయ్య,వి. రవీందర్, మహిళా కార్యదర్సులు గా పి. స్వరూప, ఎం. హేమలత,ఎల్ ధర్మవ్వ స్టేట్ కౌన్సిలర్లు గా ఎస్. నరసయ్య, జె. సుదర్శన్,పి. రమేష్,డి. వెంకటరమణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికైన నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించుట జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూతి మల్లన్న మాట్లాడుతూ పిఆర్సిని ప్రకటించకుండా బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆర్ధికంగా ఇబ్బంది కలిగించటం ప్రభుత్వానికి సరికాదని ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ప్రభుత్వం తక్షణం స్పందించి పి ఆర్సీ మరియు ఐదు డి ఏ లు, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలనీ కోరారు. అలాగే మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు మొత్తం సర్వీస్ కాలంలో వాడుకునే విధంగా వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు సాతల నరసయ్య,డి. శంకర్,నూతన కార్యవర్గ సభ్యులు,జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version