ధియేటర్ లలో హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి
పరకాల నేటిధాత్రి
ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని జయడీలక్స్ మరియు కాకతీయ థియేటర్లలో అరవ రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు.మేనేజర్, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గూర్చి అవగాహన కలిపించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషేర్ ఏర్పాటు చేసుకోవాలనీ,నిర్ధేశించిన సమయంలో వాటిని రీఫిల్ చేసుకోవాలని తెలిపారు.హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలని, రెడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉండాలని సూచించారు.హలొజెన్ దీపాలను వాడలని అత్యవసర సమయలో సిబ్బందికి,సెక్యూరీటీ సిబ్బందికి ఫైర్ స్టేషన్ నెంబర్ అందుబాటులో ఉంచి సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పరకాల అగ్ని మాపక సిబ్బంది ఎల్ఎఫ్ కృషుమార్,డ్రైవర్ సత్తయ్య ఫైర్మన్ సత్యం,దిలీప్ కుమార్ లు పాల్గొన్నారు.