అభివృద్ధి చేస్తా.. ఆదరించండి..

అభివృద్ధి చేస్తా..
ఆదరించండి

నిజాంపేట: నేటి ధాత్రి

 

అభివృద్ధి చేస్తా ఆదరించి వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని దొంతర బోయిన శ్రీకాంత్ అన్నారు. నిజాంపేట మండలం చల్మెడ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గల్లీలో ఉన్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేకమైన ఎంపి నిధులనుండి గ్రామానికి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 9 వార్డు సభ్యులు మీ అమూల్యమైన గుర్తును గ్యాస్ పొయ్యి పై వేసి గెలిపించాలని వేడుకున్నారు.

 అఖండ 2 స్పెషల్‌ షోలు రద్దు..

 అఖండ 2 స్పెషల్‌ షోలు రద్దు..

 

అఖండ -2: తాండవం’ చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 5న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడి ఈ శుక్రవారం విడుదల చేసేలా లైన్‌ క్లియర్‌ చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది.

అఖండ -2: తాండవం’ (Akhanda 2 Thandavam) చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 5న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడి ఈ శుక్రవారం విడుదల చేసేలా లైన్‌ క్లియర్‌ చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. తెలంగాణ హైకోర్టులో పెద్ద షాక్‌ (big shock to Akhanda 2) తగిలింది. సినిమా ప్రీయయర్‌ షోలు, టికెట్‌ ధర పెంచుతూ ఇచ్చిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్‌ షోలు గురువారం రాత్రి వేయడానికి సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో ‘అఖండ 2 తాండవం’ సినిమా టికెట్‌ ధర పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్‌ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్‌ చేస్తూ శ్రీనివాస్‌ రెడ్డి అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో  లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టికెట్‌ ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోల నిర్వహాణపై కూడా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ మూవీ టికెట్‌ హైక్స్‌ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్‌ రెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.అఖండ 2 సినిమా టికెట్‌ ధరలను ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్‌ ఇటీవల అనుమితి ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్‌ స్క్రీన్  థియేటర్లలో టికెట్‌ పై రూ.50, మల్టీప్లెక్స్‌ లో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 11న ప్రదర్శించే ప్రీమియర్‌ షో టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ అనుమతితోపాటు సినిమా టీమ్‌కు ఓ షరతు విధించింది. టికెట్‌ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది.

500 థియేటర్లలో ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ రీ రిలీజ్…

500 థియేటర్లలో ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ రీ రిలీజ్

విజయకాంత్ జయంతిని పురస్కరించుకుని ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ చిత్రాన్ని వచ్చే నెల 22న 500కు పైగా థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు.దివంగత సినీ నటుడు విజయకాంత్ (Vijayakanth) జయంతిని పురస్కరించుకుని ఆయన నటించిన చిత్రాల్లో బ్లాక్‌బస్టర్‌ హి ట్‌గా నిలిచిన ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ (Captain Prabhakaran) చిత్రాన్ని వచ్చే నెల 22న 500కు పైగా థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్నిఇటీవ‌ల ఓ మీడియా సమావేశంలో ఆ చిత్ర దర్శకుడు ఆర్‌కే సెల్వమణి (R. K. Selvamani), కోలీవుడ్‌ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ ఉదయకుమార్‌, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, డీఎండీకే కోశాధికారి సుధీశ్‌ సంయుక్తంగా వెల్లడించారు.

ఇదే విషయంపై వారు మాట్లాడుతూ, ‘విజయకాంత్‌ నటించి వందో చిత్రమైన ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించడంతో పాటు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీగా నిలిచింది. 1991, ఏప్రిల్‌ 14న తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరించింది. ఈ చిత్రం తర్వాతే విజయకాంత్‌ పేరుకు ముందు ‘కెప్టెన్‌’ అనే పేరు చేరింది.

అలాగే, ఈ సినిమా విడుదలై 34 యేళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఆయన బర్త్‌డే (ఆగస్టు 25) సందర్భంగా, అత్యాధునిక 4కే టెక్నాలజీతో ఆగస్టు 22న విడుదల చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 500కుపైగా థియేటర్లలో స్పారో సినిమాస్‌ తరపున కార్తీక్‌ వెంకటేశన్‌ విడుదల చేయనున్నారు’ అని వివరించారు.

హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి.!

ధియేటర్ లలో హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి

 

పరకాల నేటిధాత్రి

 

ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని జయడీలక్స్ మరియు కాకతీయ థియేటర్లలో అరవ రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు.మేనేజర్, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గూర్చి అవగాహన కలిపించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషేర్ ఏర్పాటు చేసుకోవాలనీ,నిర్ధేశించిన సమయంలో వాటిని రీఫిల్ చేసుకోవాలని తెలిపారు.హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలని, రెడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉండాలని సూచించారు.హలొజెన్ దీపాలను వాడలని అత్యవసర సమయలో సిబ్బందికి,సెక్యూరీటీ సిబ్బందికి ఫైర్ స్టేషన్ నెంబర్ అందుబాటులో ఉంచి సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పరకాల అగ్ని మాపక సిబ్బంది ఎల్ఎఫ్ కృషుమార్,డ్రైవర్ సత్తయ్య ఫైర్మన్ సత్యం,దిలీప్ కుమార్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version