బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే..

బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..

 

పెళ్లిళ్లలో చేసే పూజలు, పాటించే ఆచారాలను అందరూ కీలకంగా తీసుకుంటారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటారు. పెళ్లి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైదని సిందూరం. దానినే మర్చిపోయారు వధువు కుటుంబ సభ్యులు.

వివాహం వంటి పెద్ద వేడుకల్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద గందరగోళానికి కారణమవుతాయి. పెళ్లిళ్లలో చేసే పూజలు, పాటించే ఆచారాలను అందరూ కీలకంగా తీసుకుంటారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటారు. పెళ్లి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైదని సిందూరం. దానినే మర్చిపోయారు వధువు కుటుంబ సభ్యులు. అయితే ఆ గందరగోళాన్ని ఓ బ్లింకిట్ డెలివరీ నిమిషాల వ్యవధిలో పరిష్కరించాడు (forgot sindoor at wedding)
అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ఢిల్లీకి చెందిన పూజా, హృషి అనే జంట వివాహం ఘనంగా జరుగుతోంది. వేద మంత్రాల మధ్య సప్తపది కూడా పూర్తయింది. ఇక చివరగా వధువు నుదుట వరుడు సిందూరం దిద్దాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ సమయానికి సిందూరం ఎక్కడా కనబడలేదు. సిందూరం తీసుకురావడం మర్చిపోయారు. ముహుర్త సమయం దాటిపోతుండటం, బయటకు వెళ్లి తీసుకురావాలంటే ట్రాఫిక్ వల్ల ఆలస్యం అవుతుందని ఆందోళన మొదలైంది (Blinkit delivery in 16 minutes

ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులకు ఒక ఐడియా వచ్చింది (Blinkit saves the day). వెంటనే ఫోన్ తీసి బ్లింకిట్ యాప్‌లో సిందూరం ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన కేవలం 16 నిమిషాల వ్యవధిలోనే బ్లింకిట్ డెలివరీ బాయ్ సిందూరం తీసుకుని నేరుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు. డెలివరీ ఏజెంట్ రాగానే అతిథులందరూ హర్షధ్వానాలు చేశారు. ఆ సిందూరాన్ని తీసుకుని వరుడు పెళ్లి తంతును విజయవంతంగా ముగించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

 

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది.

 భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పండుగకు ముందు రోజున ఇంటికి శుభ్రం చేసి కొత్త రంగులతో ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. పండుగ రోజున మామిడితోరణాలు, ముద్దబంతి పూలతోఇంటి గుమ్మాలను చక్కగా అలంకరించి పండుగను జరుపుకుంటారు. ఆరోజున బంధువులు అందరూ ఒక్కచోటికి చేరుకుని.. మధుర పదార్థాలు వండి దేవతారాధన చేసి నివేదన చేస్తారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించి ఆ తర్వాత దానినే ప్రసాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం పూట ఇంటికి అంతటా కూడా దీపాలు వెలిగింది లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తారు. శైవ, వైష్ణవ క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తారు.
ఇక దీపావళి పర్వదిన రోజున శుభ ముహూర్త సమయం కావున ప్రజలు ఎంతో నమ్మకంగా బంగారం కొనుగోలు చేస్తారు. కనీసం తమకు ఉన్నంతలో డబ్బులు సమకూర్చుకొని పుత్తడి కొనుగోలు చేస్తారు. దీంతో దేశ వ్యాప్తంగా బంగారం షాపులకు బలే గిరాకీ ఉంటుంది. ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ డెలివరీ చేస్తున్నట్టుగానే.. బంగారం కూడా ఈ పండుగ నుంచి డెలివరీ చేయాలని ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. అనుకున్నదే తడవుగా బంగారం కొనుగోలు చేసే తమ యూజర్ల కోసం వినూత్న ఆలోచనతో ఓ ఈ కామర్స్ బిజిజెస్ సంస్థ ముందుకు వచ్చింది.

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ఉన్న సింబల్‌ను బంగారు నాణేలపై ముద్రించి అమ్మకానికి పెట్టింది. యూజర్లు బ్లింకిట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే లక్ష్మీ దేవి వస్తుంది. GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (0.5గ్రాములు) ధర రూ.6.999.. అలాగే GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (1 గ్రాములు) ధర రూ.13,949గా నిర్ణయించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version