చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

#కబ్జా చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

మండల కేంద్రంలోని రేవులకుంట, వెంకటపాలెం చెరువు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సంపత్ కు వినతిపత్రం అందించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం చెరువు శిఖం భూములను సైతం ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువుల శిఖం భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని. అదేవిధంగా శిఖం భూములను కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ మాసంపల్లి అఖిల్, పరికిత్యారాజు, బూస కుమారస్వామి, వైనాల జంపయ్య, మేకల మోహన్, కోల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version