నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పులోని, 20వ డివిజన్, కాశిబుగ్గ శాంతినగర్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్యాల కొమురయ్య, సోమవారం నాడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదు లోని, గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ని కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై తన వంతు కృషి చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్యాల కొంరయ్యను జిల్లా కాంగ్రెస్ నేతలు అభినందించారు.