`అంతర్గత ప్రజాస్వామ్యం.. సామాజిక న్యాయం!
`కాంగ్రెస్ కే చెల్లిన ఆదర్శ రాజకీయం
`అన్ని వర్గాలకు సముచిత స్థానం కాంగ్రెస్లోనే సాధ్యం
`ఉమ్మడి రాష్ట్రంలోనూ అనుసరించిన విధానం.. సమ ప్రాధాన్యం
`ఇప్పుడూ కాంగ్రెస్లో అందరికీ అందుతున్న పదవుల పంపకం
`మహిళా సాధికారతలోనే కాంగ్రెస్ పార్టీదే పై చేయి
`మహిళా విభాగానికి సైతం కాంగ్రెస్లో అధిక ప్రాధాన్యత
`పిసిసికి సమానంగా విభాగాలున్న ఏకైక పార్టీ కాంగ్రెస్
`అత్యధికంగా మహిళా ముఖ్యమంత్రులను చేసిన పార్టీ కాంగ్రెస్
`ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి సుచేత కృపలాని
`యుపి తొలి గవర్నర్ సరోజినీ నాయుడు
`కాంగ్రెస్ పార్టీ తొలి జాతీయ అధ్యక్షురాలు కూడా
`ఉప ప్రధానిగా, ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రాం
`అన్ని స్థాయిలలో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిందే కాంగ్రెస్
`సామాజిక న్యాయంలో కాంగ్రెస్ ను మించిన పార్టీ లేదు
`ఇప్పుడు కూడా ఏఐసిసి. అధ్యక్షుడు ఖర్గే వున్నారు
`తెలంగాణలోనూ సమన్యాయ పాలన
`బీసీలకు సముచితమైన అవకాశాల కోసం కులగనణ
`పేద వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ తోనే
`అన్ని తరగతుల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ లోనే..
`రాజకీయ సమ ప్రాధాన్యత కేవలం కాంగ్రెస్ కే సొంతం
హైదరాబాద్,నేటిధాత్రి:
వాడుకోవడానికి వర్డ్ బాగుంది కదా! అని అందరూ సామాజిక న్యాయం అనే పదం వాడుతుంటారు. కాని అందులో నిజమెంత? దానిని అనుసరించే పార్టీల విజ్ఞతెంత? రాజకీయ పార్టీల నైతికతెంత? వారు అనుసరిస్తున్న విదానమెంత? అని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీ పార్టీలకంటే ఒకింత మేలనే చెప్పాలి. ఆది నుంచి చూసినా, ఇప్పుడు పరిశీలించినా కాంగ్రెస్ ఫార్టీ జరిగేంత సామాజిక న్యాయం మరే పార్టీలోనూ జరగదు. కాని తమ పార్టీలలో ఆ సామాజిక న్యాయం అనుసరించని పార్టీలన్నీ కాంగ్రెస్ను నిందిస్తుంటాయి. మన తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో చూసినా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చూసినా ఆయా పార్టీలలో ఎంత సామాజిక న్యాయం అమలు జరుగుతుందన్నది చూస్తే జల్లడ వేసినా కాంగ్రెస్ తప్ప మరో పార్టీ కనిపించదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కొన్ని వందల వేల సార్లు చెప్పింది కేసిఆర్. కొన్నివందల సార్లు తాను కాపాలా కుక్కలా వుంటానే తప్ప తెలంగాణకు ఎట్టిపరిస్ధితుల్లోనూ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు. కాని తీరా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకివచ్చిన తర్వాత కేసిఆర్ చేసిందేమిటి? కుర్చీలో తాను కూర్చున్నాడు. కీలక పదవులన్నీ రెండు సామాజిక వర్గాల చేతుల్లో పెట్టేశాడు. ప్రాధాన్యత లేని పదవులను కూడా కొన్ని సార్లు బిసిలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చేందుకు చేతులురాలేదు. కాని కాంగ్రెస్ పార్టీలో అలా వుండదు. కొంత రెడ్డి సామాజిక వర్గానిది కాంగ్రెస్ పార్టీలో పై చేయి వుంటుందన్నది వాస్తవం. కాని పూర్తిగా వారిదే పై చేయి వుంటుందనేది కూడా నిజం కాదు. బిసి నాయకులు ఎంతో మంది కాంగ్రెస్లో కీలక భూమికపోషించారు. ఇప్పుడూ క్రియాశీలక పాత్రలో వున్నారు. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలకు అన్నింటా న్యాయం చేసిన పార్టీ ఏదైనా వుందంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే సరోజినీ నాయుడుకు 1927లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలును చేసింది. అసలు స్వాతంత్య్రోమ కాలంలో మహిళలకు అంత పెద్ద పదవి అందుతుందని ఎవరూ ఊహించలేదు. కాని తాను ఆ పదవి చేపట్టేందుకు సిద్దంగా వున్నానని చెప్పిన సరోజనీ నాయుడును కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలని చేశారు. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సరోజినీ నాయుడుకు అవకాశంకల్పించారు.1963లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేతా కృఫలానీని చేసిన ఘనతకాంగ్రెస్దే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఐదుగురు మహిళలను ముఖ్యమంత్రులను చేశారు. ఒడిషాకు చెందిన నందినీ సత్పతి, అస్సాంలో అన్వారా, డిల్లీ షీలా దీక్షిత్, పంజాబ్ రాజీందర్ కౌర్లను ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ. కాని అది బిజేపిలో సాద్యమా? జన్సంఫ్ులో సాధ్యమైందా? ఆర్ఎస్ఎస్లో సాధ్యమౌతుందా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా ముఖ్యమంత్రిని కూడా కాంగ్రెస్ పార్టీయే చేసింది. బిజేపిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమా భారతి పరిస్దితి ఏమిటి? ఆమెను క్రియాశీల రాజకీయాలకు ఎందుకు దూరం చేశారు? ఎవరు దూరం చేశారు? బిజేపిలో జాతీయ అధ్యక్షురాలిగా మహిళను నియమించగలరా? కాని కాంగ్రెస్లో మహిళా విభాగం కూడా ప్రత్యేకంగా వుంటుంది. ఆ విభాగం కూడా కీలక భూమిక పోషిస్తుంది. కాని ఇతర పార్టీలలో ఆ విభాగాలు వున్నా, ఉత్సవ విగ్రహాలుగానే వుంటారు. తప్ప ఎక్కడా పార్టీ కమిటీకి సరిసమానమైన ప్రాధాన్యత వుండదు. కాంగ్రెస్ పార్టీలో చాల వరకు ఆ మహిళా విభాగానికి ఎంతో ప్రాదాన్యత వుంటుంది. అలా మహిళా అధ్యక్ష పదవులు నిర్వహించిన వాళ్లు మంత్రులయ్యారు. రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అందులో గల్లా అరుణకుమారి. గీతారెడ్డి లాంటి వారు అనేక మంది వున్నారు. వాళ్లు ఎమ్మెల్యేలయ్యారు. పురుషాదిక్య సమాజంలో సమాన పాత్రలు పోషించారు. కాని బిజేపిలో ఆ పరిస్ధితి ఎక్కడా కనిపించదు. ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. బిజేపిలో వ్యక్తి పూజలు ఎక్కువయ్యాయి. మహిళా ప్రధాన్యత తగ్గిపోయింది. పైగా సామాజిక న్యాయం అడుగంటిపోయింది. కేంద్ర మంత్రి వర్గంలో ఎక్కువ శాతం ఉన్నత కులాలకుచెందిన నాయకులే వున్నారు. కీలకభూమికపోషిస్తున్నారు. ఉన్నత వర్గాలు కీలకంగా లేని రాష్ట్రాలలో మాత్రమే ఇతర వర్గాలకు కొంత గుర్తింపునిస్తున్నారు. తప్ప ఎక్కడా బిజేపి సామాజిక న్యాయాన్ని పాటించడం లేదు. కేవలం ప్రధాని పదవిని చూపించి, బిజేపి రాజకీయం చేస్తోంది. ఆ విషయాన్ని కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రదాని మోడీ బిసి కాదని తేల్చేశారు. అది జీర్ణించుకోలేని బిజేపి కుల రాజకీయాలను ముందు పెడుతోంది. కాని దేశంలో కుల గణనను మాత్రం తొక్కి పెట్టేస్తోంది. జనాభా గనణ చేపడితే బిసిల సంఖ్య తేలుతుంది. అన్ని కులాల లెక్కలు తేలుతాయి. దాంతో రాజకీయంగా రిజర్వేషన్ల శాతం పెంచాల్సి వస్తుంది. ఉన్నత వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే బిజేపి జనాభా గణనకు ముందుకు రావడం లేదు. నిజానికి 2021లోనే జనాభా గణన జరగాలి. కాని ఇప్పటి వరకు చేపట్టలేదు. ఆలస్యానికి కారణం చెబుతోందే తప్ప, కుల గణన సంగతి మాట మాత్రమైనా చెప్పడం లేదు. కుల గణన చేపడితే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని బిజేపి భయపడుతోంది. కాని కాంగ్రెస్ పార్టీ ఏనాడు అలా వెనుకడుగు వేయలేదు. దేశంలో డెబ్బై ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో జనాభా గణన, కుల లెక్కలు తేల్చకుండా వుండలేదు. కాని బిజేపి లెక్కలు అనగానే భయపడుతోంది. ఇటీవల రాహుల్ గాందీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచనాలయ్యాయి. దేశ బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకునేంత శక్తి బిసి, ఎస్సీ, ఎస్టీ అధికారులకు లేదా? వారి ఎంపిక చేయాల్సిన అవసరం లేదా? బడ్జెట్ రూపకల్పనలో ఉన్నత కులాల అదికారులకే బాధ్యతలా? ఆఖరుకు హల్వాతినడానికి కూడా ఇతర అధికారులు అర్హులు కారా?అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాలనా వ్యవహారాలలో కీలక భూమిక పోషించే అదికారులు కూడా ఉన్నత వర్గాలేనా? అంటూ ప్రశ్నించారు. కాని కాంగ్రెస్ పార్టీపై అలాంటి ప్రశ్నలు లేవనెత్తేందుకు బిజేపికి ఎక్కడా అవకాశం లేదు. రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడు డాక్టర్.బిఆర్.అంబెద్కర్ ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఓడిపోతే, ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి మంత్రిని చేసింది ప్రదాని నెహ్రూ. కాని బిజేపి పార్టీ చెప్పే మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకుడైన బాబూ జగ్జీవన్రాం ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. అంతే కాదు సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు జగ్జీవన్ రాం. అంతగా ఆయనకు ప్రాదాన్యత కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి బిజేపిలో ఒక దళిత నాయకుడికి ఇంతటి ప్రాదాన్యత దక్కుతుందా? ఊహించగలమా? ఇప్పుడు కూడా తెలంగాణలో మంత్రి వర్గంలో కూడా చాల వరకు న్యాయం జరిగింది. ఇంకా జరగాల్సి వుంది. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు కుల గణన చేశారు. 42శాతం బిసిలకు రిజర్వేషన్ కల్పించేందుకు సిద్దంగా వున్నారు. బిఆర్ఎస్లో దళితులకు , బిసిలకు కాంగ్రెస్లో కనిపించేంత సామాజిక న్యాయం ఊహించగలమా? 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసిఆర్ తన తొలి ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది పాలనలో మహిళా నాయకులను చిన్న చూపు చూడడం కాదా? డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినా అది ఉన్నత వర్గానికే కట్టబెట్టారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రుకు చోటు కల్పించారు. అందులోనూ ఒకరు బిసి, మరొకరు ఎస్టీకి కేటాయించారు. కొండా సురేఖ, ధనసరి అనసూయ( సీతక్క)ను మంత్రులు చేశారు. బిసిలకు కూడా బిఆర్ఎస్ కన్నా మెరుగైన స్ధానమే కల్పించారు. సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నం జరిగింది. కాకపోతే పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన నాయకుల్లో ఎక్కువగా ఉన్నత వర్గాల నాయకులే వున్నారు. ఇక తెలంగాణ ప్రకటించిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ భాధ్యతలు పొన్నాల లక్ష్మయ్యకు కట్టబెట్టారు. కాని ఆయన తన వల్ల కాదని ఆ పదవిని వద్దనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే..సామాజిక న్యాయం ఎక్కువే.. ఆ రెండు లక్షణాలులేని ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ నిందిస్తామంటే జనమే మెచ్చరు.