మహబూబాబాద్, నేటిధాత్రి: బహుజన రాజ్యాధికారాని కై హలో బహుజన చలో మానుకోట నేడు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ మహబూబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ , అసెంబ్లీ అధ్యక్షులు తప్పెట్ల, చాణక్య, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పాల్వాయి బుచ్చిరాములు పిలుపునిచ్చారు.మంగళవారం గ్రామ, గ్రామాలు తిరిగి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…బుధవారం 22న బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగ మహబూబాబాద్ యశోద గార్డెన్ లో బహుజన రాజ్యాధికార సంకల్పసభకు వస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు అధికసంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశంలో రాజ్యాధికారంలో బహుజనులకు తగిన భాగస్వామ్యం లేదు బహుజనులు మమేకమై బహుజన రాజ్యం కోసం కృషి చేయాలని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకత్వం లో బహుజనులకు న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.