రైతుల సంక్షేమమే బిజెపి ప్రభుత్వ ధ్యేయం :

రేగొండ నేటిధాత్రి :
రేగొండ, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రజాసంక్షేమం రైతుల సంక్షేమం పట్ల ఎప్పుడు నిబద్ధతతో ఉంటుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్నఅన్నారు.రేగొండ మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి అధ్యర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్బముగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపన్న మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, నిజాంనిరంకుశత్వం పాలన సాగిస్తుందని, ధర్నాల పేరట కెసిఆర్ రైతులను మోసం చేస్తూ వ్యవసాయ రంగాన్ని కూని చేస్తూ రైతులను మాయమాటలతో మోసం చేస్తున్నాడు అనిఅన్నారు. రైతుల జీవితాలతో ఆడుకున్న ఏప్రభత్వంమనుగడసాగించలేదు అని అన్నారు .

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో తెరాస ప్రభుత్వం మోసంచేస్తూఢిల్లీలోఒక్కమాట గల్లీలో ఒక్క మాటతో తెలగాంణ ప్రజల ను మోసం చేస్తూ , భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ తగలబెట్టడం సిగ్గు చేటు అని బీజేపీ కార్యకర్త మీద దాడి చేయండి అని చెప్పడం కెసిఆర్ దిగజారుడుకు నిదర్శనము అని వారుఅన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముడుపు అశోక్ రెడ్డి, సుంకరి మనో హర్, గాలిఫ్, బీజేపీ మండల ప్రధానకార్యదర్శి పెండల రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు కిరణ్,ఎస్టీ మార్చ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *