సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

అరెస్ట్ లు ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం

నర్సంపేట,నేటిధాత్రి:

తాజా మాజీ సర్పంచులు గ్రామాల అభివృద్ధి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల ఫోరం వరంగల్ జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆ బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లో సచివాలయం వద్ద శాంతియుతంఘా జరిగే నిరసన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమానికి హైదరాబాద్ మాజీ సర్పంచ్లు బయలుదేరారు.ఈ నేపథ్యంలో వారిని దుగ్గొండి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, తొగర్రాయి సర్పంచ్ ఓడేటి తిరుపతి రెడ్డి, ముద్దునూర్ సర్పంచ్ రేవూరి సురేందర్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేసి గొంతును నొక్కిపట్టి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా పోలీసులు వ్యవహరించడం తీరు మంచిది కాదని అన్నారు.ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే పెండింగ్ బిల్లు చెల్లిస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నేడు మంత్రి సీతక్క కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 12,000 మంది సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ రోజుకు ఒకచోట ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఏర్పడుతున్న పట్టింపు లేనట్టు ముసలి కన్నీరు కారుస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!