Grand Hanuman Shobha Yatra
సూర్యనాయక్ తండాలో ఘనంగా హనుమాన్ శోభా యాత్ర
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామం లో హనుమాన్ శోభా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. శోభాయాత్రలో హనుమాన్ విగ్రహాన్ని అలంకరించి ఊరే గింపుగా తీసుకెళ్లారు. యువ కులు, మహిళలు, చిన్నారు లు ఉత్సాహంగా పాల్గొని భక్తిపరవశంలో మునిగిపో యారు.భజనలు నిర్వహి స్తూ శోభాయాత్రను ఆకట్టుకు నేలాతీర్చిదిద్దారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభా యాత్ర కొనసాగి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమం ప్రశాం తంగా సాగేందుకు స్థానికులు, నిర్వాహకులు తగిన ఏర్పా ట్లు చేశారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి బానోతురాజు, మాలోతుభాష,రాజు,భాస్కర్,రమేష్, జర్పులరాజు, బానో తుఅరుణ్ భక్తులు పాల్గొ న్నారు.
