Bio Covers Distributed
ప్లాస్టిక్కు బదులు బయోడిగ్రేడబుల్ కవర్లు పంపిణీ
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లకు బదులు బయోడిగ్రేడబుల్ కవర్లను వాడాలని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ సూచించారు. శనివారం ఉదయం ప్రీతి టిఫిన్ సెంటర్లో హోటల్ యజమాని ప్రవీణ్కు బయోడిగ్రేడబుల్ ఆరోగ్య కవర్లను ఆమె అందజేశారు.ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ అధిక వేడి కలిగిన టీ, సాంబార్, ఇతర వేడి ఆహార పదార్థాలను బయోడిగ్రేడబుల్ కవర్లలో తీసుకోవచ్చని, వీటి వాడకంతో క్యాన్సర్ వంటి వ్యాధులు రావన్నారు. ఏఎస్ఆర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ భూమిలో కలిసిపోయే ఈ బయో కవర్ల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఏఎస్ఆర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపల్ శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుంటాయని చెప్పారు. బయో కవర్లు కావాల్సినవారు 9985040978, 9848731408 నంబర్లలో సంప్రదించాలన్నారు.ఈకార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గిరిగాని సుదర్శన్ గౌడ్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ నవీన్, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, ధోనాల రవి, హోటల్ యజమానులు నవీన్, కిరణ్, ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.
