నల్లబెల్లి,నేటిధాత్రి :
ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగను గురువారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ప్రక్కన గల ఈద్గా యందు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసం మొదలైన నాటి నుండి 30 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులుమంగళవారం నెల వంకను చూసి వారి యొక్క భక్తిభావాన్ని చాటుకున్నారు.ఈ నేపథ్యంలో రంజాన్ ప్రత్యేకత తరాబి నమాజును పట్టించి 31 వ రోజున ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక నమాజ్ ఈద్గాలో జరుపుకున్నారు. ఈ నమాజ్ ను మత గురువు రషీద్ అన్వర్ ఆధ్వర్యంలో చేపట్టి పండుగ యొక్క ప్రాముఖ్యతను ముస్లిం సోదరులకు తెలియజేశారు అనంతరం వివిధ కారణాలతో చనిపోయిన బంధువుల పేరుపై దానధర్మాలు చేస్తూ ముస్లిం కబ్రాస్తాన్ వద్దకు వెళ్లి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.ఈ సందర్భంగా కుల మతాలకతీతంగా ఒకరికొకరు స్నేహభావం ప్రేమను చాటుకుంటూ అలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండి షబ్బీర్ , ఎండి నన్నేసాహెబ్ , సద్దాం, హైమద్, అక్బర్, నాసర్, వాజిద్, చాంద్ పాషా, యాకూబ్, రఫీ, అంకుస్, పాషా తదితరులు పాల్గొన్నారు.