పాస్పో బ్యాక్టీరియా వాడకం పై అవగాహన.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

                                             రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు ముఖ్యంగా దుక్కిలో వేసే టువంటి 20-20- 0 -13 డి ఏ పి వంటి ఎరువులు మోతాదుకు మించి వేయడం వల్ల నేల నీరు గాలి కాలుష్యం తో పాటుగా రైతుకు ఖర్చులు పెరగడం తో పాటుగా నేల యొక్క సారం తగ్గడంతోపాటు రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం తగ్గిపోయి పంటకు మేలు చేసే టువంటి సూక్ష్మ జీవులు, వానపాముల సంఖ్య తగ్గిపోతుంది తద్వారా భూమి యొక్క సారం తగ్గడం వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు ఎరువుల పైననే సబ్సిడీ రూపేణా 65 వేల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది, రైతు వేసిన టువంటి తో ఎరువుల లో కేవలం 30-40 శాతం మాత్రమే మొక్క తీసుకోవడం జరుగుతుంది మిగతా ఎరువు మొక్క అందుకోలేని రూపంలోకి మారుతుంది, యొక్క రసాయన స్వభావం మారిపోయి దీర్ఘకాలంలో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతు యొక్క పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో భాస్వరం నిల్వల్ని కరిగించే విధంగా పాస్పో బ్యాక్టీరియా వినియోగంపై విస్తృత స్థాయిలో రైతులకు అవగాహన కల్పించే దిశలో ఈరోజు వ్యవసాయ సహాయ సంచాలకుల ఆవరణలో ఇంఛార్జి ఏడీఏ రాజ్ నారాయణ అధ్వర్యంలో డివిజన్లో పరిధిలోగల మండల వ్యవసాయ అధికారులకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు ప్రాథమిక సహకార సంఘం సభ్యులకు డీలర్లకు రైతులకు పాస్పో బ్యాక్టీరియా వాడకం మరియు వినియోగంపై క్షేత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ శ్రీ బాదే చంద్రం మరియు రామాయంపేట నిజాంపేట నార్సింగి చేగుంట వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *