vithanthuvulaku samanastanam ivalli, వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

సమాజంలో వితంతువులకు సమానస్థానం ఇవ్వాలని మడిపల్లి సర్పంచ్‌ చీర సుమలత విజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మడిపల్లి వాటర్‌ప్లాంట్‌ ఆవరణలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్పంచ్‌ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలని అన్నారు. అన్నిరంగాల్లో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈనెల 23వ తేదీన వితంతు దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వీధులలో వితంతువు మహిళలకు సమానస్థానం కల్పించాలని, వితంతువులపై వివక్షత విడనాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రంజిత్‌కుమార్‌గౌడ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గ సబ్యులు కాందారి రమేష్‌, బాలరాజు, చీర రాజమణి రమేష్‌, సంధ్య శ్రీధర్‌, బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్‌, కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *