పంట పొలాల్లోనే నేలకొరిగిన వరి…

పంట పొలాల్లోనే నేలకొరిగిన వరి

పొలంలో… రైతుల్లో… కన్నీళ్లు

నష్టాన్ని అంచనా వేయని అధికారులు

మాజీ స్పీకర్ మధుసూదనాచారి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో అకాల వర్షంతో నీళ్లలోనే పొలాలు రైతుల కంట కన్నీళ్లు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది ఇటీవల కురిచిన భారీ వర్షాలతో చేతికి వచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కోతకు వచ్చిన పంట పొలాల్లో నీరు చేరి గొలుసులు మొలకెత్తుతున్న పట్టించుకోని అధికారులు. కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు ప్రతికూల పరిస్థితుల్లో రెక్కలు కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ప్రతికూల పరిస్థితిలో రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట చేతికి రాక గుండెలు బాదుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరడమైనది

అప్పుల ఊబిలో అన్నదా తలు

సాగు చేసిన మొదలు విత్త నాలు ఎరువులు, మందులు కోతల ఖర్చులు రూపంలో రూపాయల లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుఫాను తీవ్రతకు చేతికి వచ్చిన వరి పంట నేల వాలి మొలకెత్తుతున్న దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరు పెడుతున్నారు.కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వంలో చలనం లేదు

మాజీ స్పీకర్ మధుసూదనాచారి

ఆరు గాలం శ్రమించి పండించిన పంట నేల వారిన పంట మొలకెత్తుతుంటే చేనులో నీళ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మాజీ స్పీకర్ చారి మాట్లాడుతూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది భారీ తుఫానుకు పంట పొలాలు తీవ్ర నష్టం వాటిల్లాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతే రాజును చేసిన ఘనత. అదేవిధంగా మండల, గ్రామాల అభివృద్ధి, రైతులకు అందుబా టులోకి సౌకర్యాలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వా న్నిది. మాజీ స్పీకర్ గా ఉన్నప్పుడు రైతులకు అందు బాటులోకి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి, రైతులకు న్యాయం చేయడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం యూరియా కొరత రైతులను ఇబ్బంది పెట్టడం, తుఫాను ప్రభావంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు అంచనా వెయ్యక పోవడం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్న ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

వర్షాల కాటుకు రైతులు అల్లాడుతున్నారు…

వర్షాల కాటుకు రైతులు అల్లాడుతున్నారు

◆:- ప్రభుత్వం రైతుల నాదుకోవాలి

◆:- యాసంగి పెట్టుబడికి రైతు భరోసా త్వరగా ఇవ్వాలి

◆:- మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్,మొగుడంపల్లి, నాల్కల్ మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పంటలు
నీటమునిగి పాడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఝరాసంగం మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ తెలిపారు. వర్షం ఆగకపోవడంతో పంటల తేమ తగ్గక, కోతకు వచ్చిన పంట కూడా చెడిపోతోందని, ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిల్వ ఉన్న ధాన్యం కూడా
తడిసి నాణ్యత కోల్పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ అధికారులు పంటల నష్టం వివరాలు సేకరిస్తున్నప్పటికీ, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని జగదీశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాసంగి పంటల పెట్టుబడికి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, పంటల నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం అందించాలని, విత్తనాలు
మరియు ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version