మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు..

మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

నర్సంపేట,నేటిధాత్రి:

వన మహోత్సవంలో భాగంగా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధ్యక్షులు అల్లే రాజు మాట్లాడుతూ వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎఫ్డీఓ నాగమణి ఆదేశాల మేరకు కుల సంఘం ఆవరణలో, పెద్దమ్మగుడి వద్ద పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్,ముదిరాజ్ కుల పెద్దమనిషి అల్లే పైడి కార్యదర్శి పెండ్యాల రవి,
కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నంబర్ మేకల రాజు,మాజీ కుల పెద్దమనిషి పెండ్యాల బిక్షపతి, మాజీ సొసైటీ అధ్యక్షులు కుల పెద్దమనిషి పెండ్యాల మల్లేశం, మేకల రవి,అటెండర్ అల్లే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి.

మొక్కలు నాటిన మండల విద్యాధికారి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలోని వర్షకొండ మండల పరిషత్ పాఠశాలలో విద్యాధికారి శ్రీ బండారి మధు సందర్శించడం జరిగింది పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని అభినందించాడు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో మొక్కలను పెంచడం ప్రతి విద్యార్థి భాద్యతగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

భవిష్యత్ తరాల కోసమే మొక్కలు నాటాలి ఎస్పీ కిరణ్ ఖరే.

భవిష్యత్ తరాల కోసమే మొక్కలు నాటాలి ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

భవిష్యత్తు తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ముందుండాలని, అన్ని పోలీసు స్టేషన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రకృతికి అందం మొక్కలేననీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఏ. నరేష్ కుమార్, వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలి.

వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలి.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు కృషి చేయాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. వన మహోత్సవంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని శిల్పా గార్డెన్స్ లోశేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి తో, చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ శషిరేఖ తో, యూబీడి అధికారులతో, స్థానిక అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి శిల్పా గార్డెన్స్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని చేపడుతున్నామని అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బయో డైవరసిటీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అమృత, మేనేజర్ యూసుఫ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, యూబీడి సూపెర్వైసోర్ గోపాల్, శిల్పా గార్డెన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరి కుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, ట్రెజరర్ గణేష్, జాయింట్ సెక్రటరీ సురేంద్ర, మెంబర్స్ రామ్ కిషోర్, సురేష్, యూ.ర్ రావు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన.

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ ఆవరణలో శనివారం రోజున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు నాటడం జరిగింది, పచ్చని చెట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెట్టును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని గ్రామంలోని ప్రజలందరూ ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున పెంచాలని అందరు మొక్కలు నాటినప్పుడే రాష్ట్రం పచ్చదనంగా ఉంటుందని కాలుష్య బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు, అనంతరం బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు, అలాగే మొక్కలు నాటడమే కాదని వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, రాయకమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ,కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు అలకొండ కుమారు, మరియు కాంగ్రెస్ నాయకులు బుర్ర శ్రీనివాసు అల్లం రాజు గంగాధర్ రవి, బ్యాంక్ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version