బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే…

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు
బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి 79 ప్రత్యేక బస్సులు ఏర్పాటు భక్తులకు మెరుగైన, సురక్షిత ఆర్టీసీ సేవలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తుల ప్రయాణ, రవాణా సౌకర్యాలను మెరుగుపరచే ఉద్దేశంతో 79 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, ఆదివారం రోజున జాతర బస్సు సేవలను ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ వద్ద తగిన సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని, మహిళా భక్తులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు.బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు నిరంతరంగా బస్సులు నడుస్తాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, ఏసిపి. రవికుమార్, ఆర్టీసీ ఎండీ రాజశేఖర్,ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.

ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి మున్సిపాలిటీలోని ఆయా వార్డులలో పర్యటిస్తూ నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఉదయం 7:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు.
తదుపరి తాపీ సంఘం ఆధ్వర్యంలో అభ్యాస పాఠశాలలో సుభాష్ నగర్‌లో కాల్‌టెక్స్ ఏరియాలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం ఏ ఎం సీ చౌరస్తా వద్ద స్వర్గీయ కాక వెంకటస్వామి (మాజీ కేంద్ర మంత్రి వర్యులు) విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే కాంటా చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలు, స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version