కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన..

కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినదించారు.
​ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ,ఏఐసీటీయూ,నాయకులు కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల:
​సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేకుండా పోతుంది.
​ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి, 12 నుండి 13 గంటల వరకు పని చేయించుకునేలా యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించారు.
​కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నారు.కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ₹26,000 అందించాలి.
​ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
​విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్, వాటర్ బోర్డ్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, శీను, రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటీయూ నాయకులు నారాయణ, సుల్తానా బేగం మరియు రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి…

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

పట్టణంలో కార్మిక వర్గం భారీ ప్రదర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలో బిఆర్టియు, ఏఐఎఫ్టియు (న్యూ), ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, టియుసి సంఘాల ఆధ్వర్యంలో* వరంగల్ రోడ్డు కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యాకూబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎఫ్టియు
న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేష్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు,ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంపేల్లి మునీశ్వరు,హమాలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మినారాయణలు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేటు బహుళ జాతి యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా 4 లేబర్ కోడులను తీసుకువచ్చారని కనీస వేతనం అమలు చేయాలని, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సవరణలు చేయడం సరికాదని రైతాంగం హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విధంగా కార్మికుల కూడా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువల లలిత కార్యదర్శి సంధ్య సిఐటియు పట్టణ కార్యదర్శి కందికొండ రాజు, ఆయా సంఘాల నాయకులు రాజు, నాగులు,మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version